తండ్రిపై పగతో మైనర్ పై అత్యాచారం చేసి హత్య చేసిన 15 ఏండ్ల బాలుడు
Mumbai: రెండు రోజుల క్రితం గొడవ పడిన తన తండ్రిపై ప్రతీకారం తీర్చుకోవడానికి మహారాష్ట్రలోని కళ్యాణ్లో తొమ్మిదేళ్ల బాలికపై 15 ఏళ్ల బాలుడు అత్యాచారం చేసి హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు.
Maharashtra: ఒక వ్యక్తితో గొడవపడ్డ 15 ఏండ్ల బాలుడు ప్రతీకారం తీర్చుకోవడానికి సదరు వ్యక్తి కుమార్తెను కిడ్నాప్ చేసి అత్యాచారం (లైంగికదాడి) చేశాడు. ఆపై బాలిక గొంతుకోసి ప్రాణాలు తీశాడు. ఈ షాకింగ్ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకెళ్తే.. మహారాష్ట్రలోని కళ్యాణ్లో తొమ్మిదేళ్ల బాలికపై 15 ఏళ్ల బాలుడు అత్యాచారం చేసి హత్య చేశాడు. రెసిడెన్షియల్ సొసైటీలో బాలిక మృతదేహం లభ్యం కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసు బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. తనపై దాడి చేసినందుకు బాలిక తండ్రిపై ప్రతీకారం తీర్చుకునేందుకే తాను ఈ నేరానికి పాల్పడినట్లు బాలుడు చెప్పాడు. "కళ్యాణ్లో తొమ్మిదేళ్ల బాలికపై 15 ఏళ్ల బాలుడు అత్యాచారం చేసి హత్య చేశాడు. మృతురాలి తండ్రితో నిందితుడు రెండు రోజుల క్రితం గొడవ పడ్డాడు. గురువారం తెల్లవారుజామున కళ్యాణ్ రైల్వే స్టేషన్ సమీపంలోని కళ్యాణి వెస్ట్ ప్రాంతంలోని రెసిడెన్షియల్ సొసైటీ ఆవరణలో తొమ్మిదేళ్ల బాలిక మృతదేహం లభ్యమైంది. ఈ క్రమంలోనే కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తుండగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి" అని పోలీసులు తెలిపారు.
పోలీసు బృందం పంచనామా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. పోలీసులు సీసీటీవీ ఫుటేజీని స్కాన్ చేసిన తర్వాత బాలుడిని గుర్తించారు. బాలుడి ఆచూకీ గురించి ఆ ప్రాంతంలోని కొంతమందిని విచారించిన తర్వాత, వారు అతనిని తమ అదుపులోకి తీసుకొని మహాత్మా ఫూలే పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు. పోలీసుల విచారణలో నిందితుడు రెండు రోజుల క్రితం అమ్మాయి తండ్రితో గొడవ పడ్డాడనీ, దాడికి పాల్పడ్డాడని బాలుడు పోలీసులకు చెప్పాడు. ఆ దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఆ బాలుడు బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసి, ఆపై బ్లేడుతో గొంతు కోశాడని చెప్పినట్టు పేర్కొన్నారు. బాలుడిపై లైంగిక నేరాల నుంచి రక్షణ చట్టం కింద (పోక్స్ చట్టం) కేసు నమోదు చేసిన మహాత్మ ఫూలే పోలీసులు బాలుడిని అబ్జర్వేషన్ హోమ్కు తరలించారు. తదుపరి విచారణ జరుగుతోందని తెలిపారు.
మధ్యప్రదేశ్ లోనూ..
మధ్యప్రదేశ్లోని సత్నా జిల్లాలో తన భార్యతో వివాహేతర సంబంధానికి పాల్పడినందుకు ప్రతీకారం తీర్చుకునేందుకు పొరుగువారి ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోమవారం అటవీ ప్రాంతంలో బాలిక మృతదేహం లభ్యం కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నవంబరు 17న బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. నవంబర్ 17న బాలిక కనిపించకుండా పోయిందనీ, గుర్తు తెలియని వ్యక్తి ఆమెను అపహరించినందుకు కేసు నమోదు చేసినట్లు సబ్డివిజనల్ పోలీసు అధికారి ఆశిష్ జైన్ తెలిపారు. అయితే, తమ విచారణలో కాల్ రికార్డ్ ఆధారంగా రాజేష్ రజక్ (31)ని ఆదివారం అరెస్టు చేసినట్లు చెప్పారు. “తన భార్యకు పొరుగువారితో వివాహేతర సంబంధం ఉందని రజక్ ఒప్పుకున్నాడు. ఆమెను ఆపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుని పక్కింటి కూతురిని అపహరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. తరువాత, అతను ఆమెను చంపి, మృతదేహాన్ని అడవిలో పడేశాడు అని పోలీసులు తెలిపారు.