Asianet News TeluguAsianet News Telugu

రాత్రి సంతోషంగా గడిపిన కుటుంబం, తెల్లారేసరికి... ముగ్గురు మృతితో విషాదం... !

 కొన్ని రోజులుగా పడుతున్నవర్షాలకు బాగా నానిపోయిన ఆ ఇంటి భారీ గోడ అర్ధరాత్రి సమయంలో కూలిపోయింది. లోపలపడుకున్న మీనా దేవి, ప్రియదర్శిని, ఆయుషిలు ఆ గోడ కింద ఇరుక్కుని నిద్రలోనే ప్రాణాలు విడిచారు.
 

Mother daughter duo among three killed as house collapses in Bihar
Author
Hyderabad, First Published Aug 13, 2021, 11:55 AM IST

బీహార్ లో దారుణం జరిగింది. రాత్రి సంతోషంగా గడిపిన ఆ కుటుంబంలో తెల్లవారేసరికి విషాదం నిండింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఓ వ్యక్తి రాత్రి భార్య, కూతురు, మనవరాళ్లతో కలిసి ఇంట్లో భోజనం చేశాడు. ఆ ముగ్గురినీ ఇంట్లో పడుకోబెట్టి తలుపు వేసి అతను బయట పడుకున్నాడు. ఉదయం నిద్రలేచి తలుపు తీసి లోపలికి వెళ్ళాడు. 

అక్కడి దృశ్యం చూసి అతను నోట మాట రాక షాక్ అయ్యాడు. ఇంటి గోడ కింద ఆ ముగ్గురూ విగతజీవులై కనిపించారు. బీహార్ లోని ముజఫరా నగర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సమస్తిపూర్ గ్రామానికి చెందిన సురేంద్ర చౌదరి బుధవారం రాత్రి తన భార్య మీనా దేవి (60), కూతురు ప్రియదర్శిని (23), మనవరాలు ఆయుషి (5)లతో కలిసి భోజనం చేశాడు. 

ఆ తర్వాత ఆ ముగ్గురు ఇంటి లోపల పడుకున్నారు. సురేంద్ర ఆరు బయట పడుకున్నాడు. కొన్ని రోజులుగా పడుతున్నవర్షాలకు బాగా నానిపోయిన ఆ ఇంటి భారీ గోడ అర్ధరాత్రి సమయంలో కూలిపోయింది. లోపలపడుకున్న మీనా దేవి, ప్రియదర్శిని, ఆయుషిలు ఆ గోడ కింద ఇరుక్కుని నిద్రలోనే ప్రాణాలు విడిచారు.

ఉదయం నిద్ర లేచిన సురేంద్ర తలుపు తీసి లోపలికి వెల్దామని చూసి,  అక్కడ కనిపించిన దృశ్యం చూసి, గట్టిగా కేకలు వేశాడు. చుట్టుపక్కల వాళ్లు వచ్చి ఆ ముగ్గురి మృతదేహాలను అతి కష్టం మీద బయటకు లాగారు. సమాచారం అందుకున్న పోలీసులు  అక్కడకు చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

Follow Us:
Download App:
  • android
  • ios