Asianet News TeluguAsianet News Telugu

మిస్ ఇండియా 2019గా రాజస్థాన్ యువతి

మిస్ ఇండియా - 2019గా సుమన్ రావు ఎన్నికయ్యారు. ముంబైలోని సర్థార్ వల్లభాయ్ పటేల్ ఇండోర్ స్టేడియంలో అట్టహాసంగా జరిగిన ఫైనల్ కార్యక్రమానికి బాలీవుడ్ స్టార్లు కత్రినా కైఫ్, విక్కీ కౌశల్, ఫతేహీ, మౌనీరాయ్ తదితరులు హాజరై.. డ్యాన్సులతో అదరగొట్టారు.

Miss India 2019 winner is Suman Rao
Author
Mumbai, First Published Jun 16, 2019, 10:01 AM IST

మిస్ ఇండియా - 2019గా సుమన్ రావు ఎన్నికయ్యారు. ముంబైలోని సర్థార్ వల్లభాయ్ పటేల్ ఇండోర్ స్టేడియంలో అట్టహాసంగా జరిగిన ఫైనల్ కార్యక్రమానికి బాలీవుడ్ స్టార్లు కత్రినా కైఫ్, విక్కీ కౌశల్, ఫతేహీ, మౌనీరాయ్ తదితరులు హాజరై.. డ్యాన్సులతో అదరగొట్టారు.

ఈ కార్యక్రమానికి కరణ్ జోహార్, మిస్ వరల్డ్-2017 మానుషీ చిల్లర్, మనీశ్ పాల్ హోస్ట్‌లుగా వ్యవహరించారు. రాజస్ధాన్‌ చెందిన 20 ఏళ్ల సుమన్ రావ్ మిస్ ఇండియా-2019గా కిరీటాన్ని సొంతం చేసుకోగా.. రన్నరప్‌గా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన శివానీ జాదవ్ నిలిచారు.

2018లో మిస్ ఇండియాగా నిలిచిన తమిళనాడుకు చెందిన అనుకీర్తి వాస్ ఈ కిరీటాన్ని సుమన్ రావుకు తొడిగారు.

Follow Us:
Download App:
  • android
  • ios