మిస్ ఇండియా 2019గా రాజస్థాన్ యువతి
మిస్ ఇండియా - 2019గా సుమన్ రావు ఎన్నికయ్యారు. ముంబైలోని సర్థార్ వల్లభాయ్ పటేల్ ఇండోర్ స్టేడియంలో అట్టహాసంగా జరిగిన ఫైనల్ కార్యక్రమానికి బాలీవుడ్ స్టార్లు కత్రినా కైఫ్, విక్కీ కౌశల్, ఫతేహీ, మౌనీరాయ్ తదితరులు హాజరై.. డ్యాన్సులతో అదరగొట్టారు.
మిస్ ఇండియా - 2019గా సుమన్ రావు ఎన్నికయ్యారు. ముంబైలోని సర్థార్ వల్లభాయ్ పటేల్ ఇండోర్ స్టేడియంలో అట్టహాసంగా జరిగిన ఫైనల్ కార్యక్రమానికి బాలీవుడ్ స్టార్లు కత్రినా కైఫ్, విక్కీ కౌశల్, ఫతేహీ, మౌనీరాయ్ తదితరులు హాజరై.. డ్యాన్సులతో అదరగొట్టారు.
ఈ కార్యక్రమానికి కరణ్ జోహార్, మిస్ వరల్డ్-2017 మానుషీ చిల్లర్, మనీశ్ పాల్ హోస్ట్లుగా వ్యవహరించారు. రాజస్ధాన్ చెందిన 20 ఏళ్ల సుమన్ రావ్ మిస్ ఇండియా-2019గా కిరీటాన్ని సొంతం చేసుకోగా.. రన్నరప్గా ఛత్తీస్గఢ్కు చెందిన శివానీ జాదవ్ నిలిచారు.
2018లో మిస్ ఇండియాగా నిలిచిన తమిళనాడుకు చెందిన అనుకీర్తి వాస్ ఈ కిరీటాన్ని సుమన్ రావుకు తొడిగారు.