కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందని.. రీడింగ్ తీయడానికి వచ్చిన వ్యక్తి మీద దాడి చేసి చేశాడో వ్యక్తి. దీంతో మీటర్ రీడర్‌ను తీయడానికి వచ్చిన లక్ష్మీనారాయణ త్రిపాఠి అక్కడికక్కడే మృతి చెందాడు. 

ఒడిశా : ఒడిశాలోని గంజాం జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. గంజా జిల్లా కుపతి గ్రామంలో ఓ యువకుడు విద్యుత్ మీటర్ రీడింగ్ తీయడానికి వచ్చిన వ్యక్తిని నరికి చంపాడు. ఈ దురదృష్టకర సంఘటనఆ ప్రాంతంలో కలకలం రేపింది.

ప్రాథమిక నివేదికల ప్రకారం, నిందితుడు యువకుడు, అతని గుర్తింపు ఇంకా నిర్ధారించబడలేదు. విద్యుత్తు బిల్లు ఎక్కువగా వస్తుందని కోపంతో.. కరెంట్ రీడింగ్ తీయడానికి వచ్చిన మీటర్ రీడర్‌పై దాడి చేశాడు. దీంతో రీడర్ అక్కడి కక్కడే మృతి చెందాడు. మృతి చెందిన మీటర్ రీడర్‌ను లక్ష్మీనారాయణ త్రిపాఠిగా గుర్తించారు.

బ్యాంక్‌లో మేనేజర్‌గా ఉద్యోగం.. కానీ జీవితంలో అనుకున్న గోల్ రీచ్ కాలేదని..

గతంలో కరెంటు బిల్లు విషయంలో లక్ష్మీనారాయణకు, నిందితుడికి మధ్య వాగ్వాదం జరిగిందని తెలుస్తోంది. లక్ష్మీనారాయణ సోమవారం వినియోగదారుడి ఇంటికి మీటర్ రీడింగ్ కోసం రావడంతో.. మరోసారి వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రహానికి లోనైన వినియోగదారుడు లక్ష్మీనారాయణపై దాడి చేయడంతో అతడి మృతి చెందాడు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటన అనంతరం నిందితుడు పరారీలో ఉన్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, ఇటీవలి కాలంలో చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. ఫోన్ చూడొద్దన్నందుకు, ఆడుకోవద్దు అన్నందుకు, పరీక్షలో ఫెయిల్ అవుతానని భయంతో.. ఇలా అతి స్వల్ప విషయాలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అలాంటి ఘటనే తమిళనాడులోని చెన్నైలో వెలుగు చూసింది. ఇంటిని శుభ్రం చేయడం లేదని ఓ తల్లి కూతురుని మందలించింది. దీంతో మనస్థాపం చెందిన ఆ కూతురు ఆత్మహత్య చేసుకుంది. 

ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ పుదుపట్టు గ్రామానికి చెందిన సభాపతి (42) తిరువళ్లూరు కలెక్టర్ కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు.. అతనికి వివాహమై భార్య కవియరసి.. పిల్లలు రాకేష్ (16), దర్శినిక (15), సంజిత్ (12)లు ఉన్నారు.

పన్నూరులోని ఓ ప్రైవేటు స్కూల్లో పిల్లలు ముగ్గురు చదువుకుంటున్నారు. ఆదివారం నాడు వీరి ఊర్లో ఓ జాతర జరిగింది. ఊరంతా పండుగ సందర్భంగా ఇల్లు నీటుగా పెట్టుకోవాలని.. ఇంటిని శుభ్రం చేయమని పెద్ద కూతురు దర్శినికాకు తల్లి పురమాయించింది. కానీ దర్శనిక ఆ పని చేయలేదు. దీంతో తల్లి కవియరసి మందలించింది. తల్లి కొప్పడడంతో తీవ్ర మనస్తాపం చెందిన దర్శినిక… ఇంట్లోని ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. 

ఈ మేరకు తండ్రి సభాపతి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ప్రకారం కేసు నమోదు చేసుకున్న ముప్పేడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అప్పటివరకు ఎంతో సంతోషంగా తిరిగిన అమ్మాయి ఒకసారిగా మృతి చెందడంతో స్థానికంగా విషాదాన్ని నింపింది.