Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ లోని రాంబన్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభ‌వించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. రాంబన్ జిల్లాలో బుధవారం తాత్కాలిక గుడిసెల్లో మంటలు చెలరేగడంతో ఓ మహిళ, ఆమె ఇద్దరు కుమార్తెలు సజీవదహనమయ్యారని సంబంధిత అధికారులుతెలిపారు. 

Massive Fire In Jammu And Kashmir's Ramban: జమ్మూ కాశ్మీర్ లోని రాంబన్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభ‌వించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. రాంబన్ జిల్లాలో బుధవారం తాత్కాలిక గుడిసెల్లో మంటలు చెలరేగడంతో ఓ మహిళ, ఆమె ఇద్దరు కుమార్తెలు సజీవదహనమయ్యారని సంబంధిత అధికారులు తెలిపారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

వివ‌రాల్లోకెళ్తే.. జమ్మూ కాశ్మీర్ లోని రాంబన్ జిల్లాలోని ఓ గ్రామంలో బుధవారం జరిగిన అగ్నిప్రమాదంలో ఓ మహిళ, ఆమె ఇద్దరు పిల్లలు మృతి చెందారు. పోగల్ పరిస్తాన్ ఎగువ ప్రాంతంలోని హమ్మర్ గలీలో జరిగిన ఈ ఘటనలో మహిళ భర్త, అత్తకు గాయాలయ్యాయి.

గుడిసెలు గుజ్జర్ సామాజిక వర్గానికి చెందినవనీ, ప్రాథమిక సమాచారం ప్రకారం నజ్మా బేగం (25), ఆమె కుమార్తెలు అస్మా బానో (6), ఇక్రా బానో (2) మంటల్లో మరణించారని అధికారులు తెలిపారు. నజ్మా భర్త ఇబ్రహీం, అత్త మీర్జాబేగంకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ఉఖేరాల్ లోని ప్రజారోగ్య కేంద్రంలో చేర్పించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని అధికారులు తెలిపారు.

Scroll to load tweet…

శ్రీన‌గ‌ర్ లోనూ అగ్నిప్ర‌మాదం.. ఇళ్లు ద‌గ్దం, ఒక‌రికి తీవ్ర గాయాలు 

శ్రీనగర్‌లోని ఖన్యార్ ప్రాంతంలో బుధవారం మంటలు చెలరేగడంతో ఒక నివాస గృహం కూడా దెబ్బతిన్న‌ది. ఈ ప్ర‌మాదంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మీర్జా బాగ్ ప్రాంతంలో మంటలు చెలరేగడంతో గ్రౌండ్ ఫ్లోర్‌లోని రెండు దుకాణాలు ఉన్న ఇల్లు దెబ్బతిన్నట్లు అధికారి ఒకరు తెలిపారు. ఈ ఘటనలో బిలాల్ అహ్మద్ అనే కౌలుదారు కూడా గాయపడ్డాడని తెలిపారు. "అద్దెదారు పత్తి నుండి వస్తువులను తయారు చేసే అద్దె వసతి గృహంలో గ్యాస్ లీకేజీ కారణంగా మంటలు చెలరేగాయి" అని అతను చెప్పాడు.