ప్రయాగ్ రాజ్ కుంభమేళాలో అగ్ని ప్రమాదం
ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్ కుంభమేళాలో సోమవారం నాడు అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. వంట గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం వాటిల్లింది
లక్నో: ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్ కుంభమేళాలో సోమవారం నాడు అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. వంట గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం వాటిల్లింది. అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని దిగంబర్ అఖాండా ప్రాంతంలో వంట గ్యాస్ సిలిండర్ పేలుడు కారణంగా ఈ ప్రమాదం వాటిల్లింది. ప్రమాదం జరిగిన చోట వందలాది టెంట్లు ఉన్నాయి. అయితే ఈ విషయాన్ని గుర్తించిన వెంటనే అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు.
49 రోజుల పాటు అర్ధ కుంభమేళా జరగనుంది. ఈ కుంభమేళాకు సుమారు 12 కోట్ల మంది హాజరౌతారని అంచనా వేస్తున్నారు ఈ కుంభమేళాలో నాగ సాధువులు కూడ పాల్గొంటారు. 49 రోజుల పాటు సాగే ఈ కుంభమేళాలో 8 రోజులను అత్యంత పవిత్రంగా చూస్తారు. ఈ కుంభమేళా రేపటి నుండి ప్రారంభం కానుంది.
Prayagraj: Fire breaks out at a camp of Digambar Akhada at #KumbhMela pic.twitter.com/yq0yO7jr4i
— ANI UP (@ANINewsUP) 14 January 2019