భార్య కోరుకున్న వ్యక్తితో దగ్గరుండి ఆమె పెళ్లి చేయించిన భర్త.. అసలేం జరిగిందంటే..
అతనికి ఐదు నెలల క్రితం పెళ్లి (marriage) జరిగింది. అయితే భార్య (wife) మనసులో తాను లేనని తెలుసుకున్నాడు. మరోకరిని ప్రేమించానని, ఆ వ్యక్తితోనే కలిసి బతకాలని అనుకుంటున్నానని ఆమె చెప్పడంతో.. తన పెళ్లిని త్యాగం చేశాడు. ఆమెకు ప్రియుడితో దగ్గరుండి వివాహం జరిపించాడు.
అతనికి ఐదు నెలల క్రితం పెళ్లి (marriage) జరిగింది. అయితే భార్య (wife) మనసులో తాను లేనని తెలుసుకున్నాడు. మరోకరిని ప్రేమించానని, ఆ వ్యక్తితోనే కలిసి బతకాలని అనుకుంటున్నానని ఆమె చెప్పడంతో.. తన పెళ్లిని త్యాగం చేశాడు. ఆమెకు ప్రియుడితో దగ్గరుండి వివాహం జరిపించాడు. అచ్చం సినిమా మాదిరిగానే జరిగిన ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో (Kanpur) చోటుచేసుకుంది. వివరాలు.. బర్రా-8 ప్రాంతంలో నివసిస్తున్న పంకజ్ శర్మ గురుగ్రామ్లోని ఓ ప్రైవేటు కంపెనీలో అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు. అతనికి ఈ ఏడాది మే 2వ తేదీన కాన్పూర్ నగరంలోని భౌంతి సచెండి ప్రాంతానికి చెందిన కోమల్తో వివాహం జరిగింది. సంప్రదాయం ప్రకారం పంకజ్, కోమల్ ఒక్కటయ్యారు. అయితే పెళ్లి జరిగినప్పటి నుంచి కోమల్.. పంకజ్ను దూరం పెట్డం మొదలుపెట్టింది. సరిగా మాట్లాడటం కూడా చేసేది కాదు. దీంతో కోమల్ని బుజ్జగించిన పంకజ్ అసలు విషయం ఏమిటని ఆరా తీశాడు. అప్పుడు కోమల్.. పిటూ అనే వ్యక్తిని ప్రేమిస్తున్నట్టుగా చెప్పింది. అతడినే పెళ్లి చేసుకోవాలనేది తన కోరిక అని వెల్లడించింది.
Also read: దళిత యువకుడితో ప్రేమ పెళ్లి.. నచ్చని యువతి తల్లిదండ్రులు ఏం చేశారంటే..!
దీంతో పంకజ్.. కోమల్ తల్లిదండ్రులకు ఇదే విషయం చెప్పాడు. ఈ విషయం తెలిసిన వారు కోమల్కు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ కోమల్ తన నిర్ణయాన్ని మార్చుకోవడానికి సిద్దంగా లేదు. చివరకు ఈ విషయం గోల్ చౌరహా ప్రాంతంలోని గృహా హింస వ్యతిరేక సెల్ అండ్ అశా జ్యోతి సెంటర్కు చేరింది.
దీంతో ఆశా జ్యోతి సెంటర్ ఇంచార్జ్ నిధి గుప్తా.. పంకజ్, కోమల్, ఆమె ప్రియుడు పిటూ, వారి బంధులవులతో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కోమల్ మాట్లాడుతూ.. తన ప్రియుడితో కలిసి బతకాలని అనుకుంటున్నట్టుగా చెప్పింది. తాము పెళ్లి చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని నిధి గుప్తాను కోరింది. అక్కడ అనేక చర్చలు సాగిన అనంతరం కోమల్ ఆమె ప్రియుడిని పెళ్లి చేసుకోవడానికి పంకజ్ అంగీకరించాడు. ఈ పెళ్లి జరిపించడానికి ఓ లాయర్ను కూడా నియమించాడు.
Also read: ఆసుపత్రిలోనే డాక్టర్ బాబు రాసలీలలు.. సిబ్బందితో రొమాన్స్ చేస్తున్న వీడియో వైరల్.. చివరకు..
ఈ క్రమంలోనే కోమల్ తన ప్రియుడిని పెళ్లాడింది. ఆశాజ్యోతి సెంటర్లో ఈ పెళ్లి జరిగింది. స్థానిక పోలీస్ ష్టేషన్కు చెందిన సిబ్బంది, అధికారులు, ముగ్గురి వైపు బంధువులు ఈ పెళ్లికి సాక్ష్యంగా నిలిచారు. ఇందుకు సంబంధించి స్థానికులు మాట్లాడుతూ.. ఇక్కడ అచ్చం సినిమాలో మాదిరిగా జరిగిందని, తాము ఈ ఘటనకు సాక్ష్యంగా నిలిచామని చెప్పారు.