ఢిల్లీలోని కపిల్ విహార్‌కు చెందిన విజయ్ అనే 38 ఏళ్ల వ్యక్తి తన భార్య సంతోషి దేవిని హత్య చేసి ఆమె మృతదేహాన్ని బాత్‌రూమ్‌లో దాచి పెట్టాడు. ఆ తరువాత దాన్ని ఎలా పారవేయాలో తెలీక.. సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నేరం అంగీకరించాడు.

ఢిల్లీ : Delhiకి చెందిన ఓ వ్యక్తి దారుణానికి తెగబడ్డాడు. తన భార్యను Murder చేసి శవాన్ని ఇంట్లోని bathroomలో దాచాడు. ఢిల్లీలోని కపిల్ విహార్‌కు చెందిన విజయ్ (38) జూన్ 18న తన భార్యను హత్య చేసినట్లు భల్స్వా డెయిరీ పోలీస్ స్టేషన్‌లో అధికారులకు సమాచారం అందించాడు. విచారణ అనంతరం ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతురాలు సంతోషిదేవిని భర్త గుడ్డలో చుట్టి ఉంచినట్లు గుర్తించారు.

వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. విజయ్‌కి ఇంతకు ముందు మరో మహిళతో వివాహం జరిగిందని, అతనికి నలుగురు పిల్లలు ఉన్నారని అధికారులు గుర్తించారు. అనంతరం ఓ ఆసుపత్రిలో పనిచేస్తున్న బాధితురాలితో అతనికి పరిచయం ఏర్పడింది. అది కాస్తా వారి మధ్య ప్రేమకు దారి తీసింది. ఇది తెలిసిన వెంటనే, అతని మొదటి భార్య అతని నుండి విడిపోయింది. మృతురాలు సంతోషికి నలుగురు పిల్లలు, 14, 13, 12 ఏళ్ల ముగ్గురు అమ్మాయిలు, 8 ఏళ్ల అబ్బాయి ఉన్నారు. ఆమె కూడా భర్తతో విడిపోయి ఒంటరిగా జీవిస్తోంది.

దీంతో భార్య విడిపోవడంతో విజయ్, సంతోషి సహజీవనం చేయడం ప్రారంభించారు. వీరికి ఒక బిడ్డ కూడా ఉంది. కాలక్రమేణా, పిల్లలందరి సంరక్షణకు సంబంధించిన విషయంలో విజయ్, సంతోషి మధ్య కొన్ని చిన్న చిన్న సమస్యలు తలెత్తాయి. జూన్ 17 సాయంత్రం, సంతోషి పని నుండి తిరిగి వచ్చాడు. రాత్రి 11.30 గంటల సమయంలో, మళ్లీ గొడవ జరిగింది. పిల్లలందరూ గ్రౌండ్ ఫ్లోర్‌లో నిద్రపోతున్నారు. విజయ్, సంతోషి పై అంతస్తులో ఉన్నారు.

గొడవ ఎంతకీ ముగింపుకు రాకపోవడం.. పదే పదే గొడవలు రిపీట్ అవుతుండడంతో నిందితుడు కోపంతో సంతోషిని గొంతు నులిమి చంపేశాడు. ఆ తరువాత అనుమానం రాకుండా మృతదేహాన్ని ఎక్కడైనా మాయం చేయాలనుకున్నాడు. దీనికోసం మృతదేహాన్ని గుడ్డలో చుట్టాడు. ఆ తరువాత ఎవ్వరూ చూడకుండా పారవేద్దామనుకున్నాడు. కానీ, అతను ఆ పని చేయలేకపోయాడు. దీంతో ఏం చేయాలో పాలుపోక.. జూన్ 18 రాత్రి 8.45 గంటల ప్రాంతంలో పోలీసులను ఆశ్రయించాడు. తన నేరాన్ని అంగీకరించాడు.

బండినిండా బస్తాల కొద్దీ రూ.10 నాణాలు.. కారు కొనడానికి వచ్చిన వ్యక్తిని చూసి షాక్.. ఎందుకంటే..

కాగా, మే 11న ముంబైలో ఇలాంటి ఘటనే జరిగింది. ముంబైలో సకినాకాలోని ఖైరానీ రోడ్డు ప్రాంతంలో మనోజ్ ప్రజాపతి, అతని భార్య రీమా బోలా యాదవ్ నివసిస్తున్నారు. అయితే, ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ.. వారు గత రెండు రోజులుగా విడివిడిగా నివసించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో అనుకోకుండా ఒక రోజు రీమా స్నేహితురాలు.. రీమా ఇంటికి వచ్చి చూసేటప్పటికీ ఆమె రక్తపు మడుగులో పడి ఉంది. దీంతో స్నేహితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు.

ఈ క్రమంలో రీమా భర్తను అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే అతను తొలుత కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించాడు. కానీ, నిందితుడి గోళ్లపై ఉన్న రక్తపు మరకలు అతన్ని పట్టుబడేలా చేశాయని పోలీసులు తెలిపారు. రీమా తన మొబైల్లో చివరిసారిగా తన భర్తతోనే సంభాషించినట్లు వెల్లడించారు. దీంతో పోలీసులు రీమా భర్తను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.