మైనర్ బాలికపై ఐదేళ్లుగా అత్యాచారం.. గర్భం రావడంతో..!
గత ఐదేళ్లుగా బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దంటూ బెదిరించడం గమనార్హం.
దేశంలో రోజు రోజుకీ మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. పాలుదాగే పసిపిల్ల దగ్గర నుంచి... కాటికి కాళ్లు చాపిన ముసలి వారిని కూడా వదలడం లేదు. తాజాగా... ఓ ఘోరం వెలుగులోకి వచ్చింది. 15ఏళ్ల మైనర్ బాలికపై గత ఐదు సంవత్సరాలుగా.. ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. కాగా... అతని కారణంగా బాలిక ఇటీవల గర్భం దాల్చడం గమనార్హం. ఈ సంఘటన చండీగడ్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్ లోని వారణాసికి చెందిన మైనర్ బాలిక.. పాటియాలాలోని తన కజిన్ ఇంట్లో ఉంటోంది. ఈ సమయంలో బాలికపై ఓ యువకుడు కన్నేశాడు. గత ఐదేళ్లుగా బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దంటూ బెదిరించడం గమనార్హం.
ఈ విషయం గురించి ఎవరికైనా సమాచారం ఇస్తే ఆమె తల్లిదండ్రులను హత్య చేస్తానని అతడు బెదిరించాడు. దీంతో ఈ విషయాన్ని ఇన్నేళ్లుగా ఆమె బయటకు చెప్పలేదు. అత్యాచారం ఫలితంగా, మైనర్ అమ్మాయి గర్భవతి అయింది. జూన్ 12 న ఆమె రాజీంద్ర ఆసుపత్రిలో ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఆమె బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత.. ఈ నేరం గురించి ఆమె తల్లిదండ్రులు తెలిసింది. భాదిత కుటంబం ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీలోని 376, 506 సెక్షన్లతో పాటుగా, పోక్సో చట్టంలోని సంబంధిత విభాగాల కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు.