బస్సులో నిద్రిస్తున్న యువతికి.. పదే పదే ముద్దులు పెట్టిన పోకిరి...
గురువారం తెల్లవారుజామున 5 గంటలప్పుడు బస్సు బెంగళూరు పీణ్యా వద్ద ఉండగా యువతి నిద్రలోకి జారుకుంది. ఈ సమయంలో ఓ యువకుడు పదే పదే ముద్దు పెట్టాడని యువతి ఆరోపించింది.
కర్ణాటకలో పోకిరీ రెచ్చిపోయాడు. బస్సులో నిద్రిస్తున్న యువతిని ఓ పోకిరీ యువకుడు ముద్దు పెట్టుకుని అశ్లీలంగా ప్రవర్తించాడు. బాధిత యువతి ఆర్కిటెక్చర్ విద్యార్థిని. కాగా, బుధవారం రాత్రి 10.40కి బళ్లారిలో కేఎస్ ఆర్టీసీ బస్సు ఎక్కింది.
గురువారం తెల్లవారుజామున 5 గంటలప్పుడు బస్సు బెంగళూరు పీణ్యా వద్ద ఉండగా యువతి నిద్రలోకి జారుకుంది. ఈ సమయంలో ఓ యువకుడు పదే పదే ముద్దు పెట్టాడని యువతి ఆరోపించింది. గాఢ నిద్రలో ఉండి.. మెలకువ వచ్చి చూసే సరికి జరుతున్న దారణం అర్థమయ్యింది.
కరోనా నుంచి కోలుకున్న తర్వాత.. పిత్తాశయ సమస్యలు..!
వెంటనే కంగారుగా కళ్లు తెరిచింది కానీ.. ఆ భయాందోళనలో అతను ఎవరో గుర్తించలేకపోయింది. వెంటనే భయంతో యువతి బస్సు దిగి పీణ్యా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు యువకుని కోసం గాలింపు చేపట్టారు.