ఓ యువకుడు తొమ్మిదేళ్ల చిన్నారిని హత్యచేసి ముక్కలుగా నరికాడు. ఆ తరువాత ఆ శరీరభాగాలను ఓ పాడుబడిన ఇంట్లో ప్లాస్టిక్ కవర్ లో కుక్కి పడేశాడు.
రాజస్థాన్ : ఓ యువకుడు 9 ఏళ్ల బాలికను హత్య చేశాడు. ఆ తర్వాత ఆ చిన్నారి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ప్లాస్టిక్ సంచుల్లో మూట కట్టి.. వాటిని ఓ పాడుబడిన ఇంట్లో పడేశాడు. ఈ దారుణమైన ఘటన రాజస్థాన్లో చోటుచేసుకుంది. ఆ యువకుడి వయసు 20యేళ్లు. దీనికి సంబంధించి వివరాలు వెలుగులోకి రావడంతో ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య గురించి ప్రశ్నిస్తున్నామని ఆదివారం పోలీసులు తెలిపారు. హత్యకు ముందు బాలిక మీద అత్యాచారానికి పాల్పడ్డాడేమో అని అనుమానాన్ని కూడా కొట్టి పారే లేవని పోలీసులు తెలిపారు.
అయితే బాలిక గత మూడు రోజుల నుంచి మిస్సింగ్. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు అందింది. గత నెల 29వ తేదీన కనిపించకుండా పోయింది. దీంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆమె శరీర భాగాలు మావ్లీ ప్రాంతంలోని ఓ పాడుబడిన ఇంట్లో దొరికాయి. శనివారం రాత్రి ఇంట్లో నుంచి దుర్వాసన వస్తున్నట్లుగా ఇరుగుపొరుగు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ప్రాంతానికి చేరుకున్న పోలీసులు గాలింపులో చేపట్టగా ఇంట్లో కూలిన స్థితిలో చిన్నారి శరీర భాగాలు దొరికాయి.
కదులుతున్న రైలులో పెట్రోల్ దాడి.. చిన్నారితో సహా ముగ్గురు మరణం..ఇద్దరి పరిస్థితి విషమం..
ఇదిలా ఉండగా, మార్చి 27న కోల్ కతాలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. కోల్కతాలో యేడేళ్ల బాలికను ఆమె పక్కింటివ్యక్తి కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆమె మృతదేహం పొరుగు ఫ్లాట్లోని గోనె సంచిలో కుక్కి కనిపించింది. ఇది వెలుగులోకి రావడంతో 32 ఏళ్ల నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోల్కతాలోని శ్రీధర్ రాయ్ రోడ్లో నివసిస్తున్న మైనర్ బాలిక మార్చి 26న తెల్లవారుజామున కనిపించకుండా పోయింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మార్చి 26 ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో బాధితురాలి కుటుంబ సభ్యులు తిలజాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాలిక కనిపించకుండా పోవడంతో వారు..ఇంట్లో, బయట, చుట్టుపక్కల వెతికారు. ఆ తరువాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇంట్లో, బయట వెతకడమే కాకుండా.. బాలిక నివసించే భవనంలోని మొత్తం 32 ఫ్లాట్లలో క్షుణ్ణంగా సోదాలు నిర్వహించారు. కానీ బాలిక ఆచూకీ లభించలేదు.
కాగా, మైనర్ బాలిక పక్కనే ఉన్న భవనంలోకి ప్రవేశించడం సిసిటివిలో కనిపించిందని స్థానికులు తెలిపారు. అయితే.. ఈ ఫుటేజీని పోలీసులకు చూపించినప్పటికీ, వారు క్షుణ్ణంగా వెతికినా ఆమె జాడ కనిపెట్టలేకపోయారు. దీంతో పోలీసుల పనితీరుపై ఇరుగుపొరుగు వారిలో ఆందోళన నెలకొంది. చాలాసేపు వెతికిన తర్వాత.. సాయంత్రానికి వారింటి పక్కనే తాళం వేసి ఉన్న ఇంటిని గమనించిన ఇరుగుపొరుగు వారికి అనుమానం వచ్చింది. వారు తాళం పగులగొట్టి చూడగా గోనె సంచిలో తప్పిపోయిన బాలిక మృతదేహాన్ని గుర్తించారు.
అలోక్కుమార్ ఫ్లాట్లోని రెండో అంతస్తులో మృతదేహం లభ్యమైనట్లు కోల్కతా పోలీసులు ధృవీకరించారు. బీహార్లోని సమస్తిపూర్కు చెందిన అలోక్కుమార్ను పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో హత్య చేసినట్లు అంగీకరించారు. 7 ఏళ్ల బాలిక హత్య వెనుక ఉద్దేశ్యం ఇంకా తెలియలేదు. అరెస్టు చేసిన నిందితుడిని ప్రస్తుతం ప్రశ్నిస్తున్నారు. బాలిక తల, చెవిపై గాయాలున్నట్లు గుర్తించిన పోలీసులు పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తారు.
ఈ సంఘటన తరువాత, ఆ ప్రాంతంలో గందరగోళం చెలరేగింది. పోలీసుల నిర్లక్ష్యమే బాలిక మరణానికి కారణమని ఆరోపిస్తూ ఇరుగుపొరుగు వారు టిల్జాల పోలీస్ స్టేషన్ను చుట్టుముట్టి నిరసన తెలిపారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు అదనపు బలగాలను మోహరించి, జనం ఆందోళనకు దిగడంతో పోలీస్ స్టేషన్ గేటును కూడా మూసివేశారు. ఈ కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నామని, పోస్టుమార్టం నివేదిక అందుబాటులోకి వచ్చిన తర్వాత మరింత సమాచారం అందిస్తామని కోల్కతా పోలీసు సీనియర్ అధికారి ప్రజలకు హామీ ఇచ్చారు.
