యువతిని అపహరించి బలవంతంగా పెళ్లి.. గడ్డితో మంట వేసి సప్తపది.. వీడియో వైరల్..
రాజస్థాన్లోని జైసల్మేర్లో దారుణం జరిగింది. ఓ యువతిని కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసుకున్న పాశవికమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.
కామంతో కొట్టుకుంటున్న మృగాళ్లు ఆడవాళ్లు కనిపిస్తే చాలు .. వావి వరుసలు మరిచి రెచ్చిపోతున్నారు.. చిన్నా పెద్దా అని తేడా లేకుండా ఇష్టాను సారంగా ప్రవర్తిస్తున్నారు. చాలా మంది మహిళలు మగాళ్ళ కామ దాహానికి బలవుతున్నారు. ఎందరో మహిళలు ప్రాణాలను కూడా పోగొట్టుకుంటున్నారు. వారి రక్షణ కోసం కఠినతరమైన చట్టాలను తీసుకవచ్చినా ఫలితం లేకుండా పోతుంది. నిత్యం ఎదొక చోట ఆడ పిల్ల కన్నీరు పెడుతోంది. ఓ యువతిని రౌడీ కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటన రాజస్థాన్లోని జైసల్మేర్లో వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకెళ్తే.. జైసల్మేర్ లోని మోహన్గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంఖ్లా గ్రామంలో జూన్ 1న దారుణం ఘటన జరిగింది. 15 నుంచి 20 మంది గుంపు ఓ యువతిని అపహరించి.. బలవంతంగా కారులో తీసుకెళ్లారు. ఆ తరువాత ఓ నిర్జన ప్రాంతానికి ఆ యువతిని తీసుకెళ్లి.. ఓ రౌడీ ఆ యువతి మెడలో తాళి కట్టారు. యువతి ఏడుస్తున్న పట్టించుకోకుండా..ఆమెను బలవంతంగా ఎత్తుకుని ఓ మంట చూట్టు తిరిగాడు. యువతి ఏడుస్తున్న పట్టించుకోకుండా ఆమెను ఎత్తుకుని మంట తిరుగుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఇందులో రౌడీ బాలికను తన ఒడిలో పెట్టుకుని తిరుగుతూ కనిపిస్తాడు. బాధితురాలు ఏడుస్తూ కనిపించడంతోపాటు ఇతర రౌడీలు సిగ్గులేకుండా వీడియోలు తీస్తున్నారు. బాలికను అపహరించిన రౌడీలపై పోలీసులు కేసు నమోదు చేసినా చర్యలు తీసుకోలేదని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన జరిగి ఏడు రోజులు గడిచినా బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారి జాడ లేదు. దీంతో ఆందోళనకు దిగుతామని బంధువులు హెచ్చరించారు. మరోవైపు కూతురికి న్యాయం చేయకుంటే ఆత్మాహుతి చేసుకుంటామని బాలిక తండ్రి పోలీసులను హెచ్చరించాడు.
కలెక్టర్ కి విజ్ఞప్తి
దీంతో బాలిక బంధువులు కలెక్టర్ కార్యాలయం, పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. జిల్లా కలెక్టర్ టీనా దాబీ, పోలీసు సూపరింటెండెంట్ వికాస్ సగ్వాన్లకు వినతి పత్రం సమర్పించారు. బాలికను కిడ్నాప్ చేసిన వ్యక్తులను ఇంతవరకు అరెస్ట్ చేయలేదని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నిందితుల్లో నైతిక స్థైర్యం పెరిగింది. స్వేచ్ఛగా తిరుగుతున్నారు. అదే సమయంలో మళ్లీ బాలికను కిడ్నాప్ చేస్తామని బెదిరిస్తున్నారు.
అదే సమయంలో నిందితులు బాలికతో బలవంతంగా తిరుగుతున్న వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. తద్వారా ఆ అమ్మాయికి మరెక్కడా పెళ్లి జరగదు. నిందితులు బాలిక పరువు తీస్తున్నారు. దీంతో నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ బంధువులు జిల్లా కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్కు వినతిపత్రం సమర్పించారు. నిందితులను అరెస్టు చేయకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు బాలిక బంధువులు. బాలిక కిడ్నాప్కు పాల్పడిన నిందితులందరినీ అరెస్ట్ చేయాలని బంధువులు డిమాండ్ చేశారు.
అలా చేయకుంటే ఆందోళనకు దిగుతామన్నారు. 2 రోజుల్లోగా నిందితులను అరెస్ట్ చేయకపోతే తనతో పాటు భార్య కూడా బలవన్మరణానికి పాల్పడతామని బాలిక తండ్రి చున్సింగ్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దాంతో రాజస్థాన్లోని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఓ ఆడపిల్లను ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకున్నా ప్రభుత్వం నిందితులపై ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం దారుణమని ప్రతిపక్ష బీజేపీ, ఆమ్ఆద్మీ పార్టీ మండిపడ్డాయి.
నిందితులను త్వరలో పట్టుకుంటాం
ఈ ఘటనపై మోహన్గఢ్ పోలీస్స్టేషన్ ఇన్చార్జి పుఖారామ్ మాట్లాడుతూ.. బాలికకు జూన్ 12న వివాహం జరగాల్సి ఉంది. ఈ తరుణంలో పూనమ్ నగర్కు చెందిన పుష్పేంద్ర సింగ్ అనే వ్యక్తి బాలికను అపహరించాడు. జూన్ 1న బాలిక అపహరణకు గురైనట్లు మోహన్గఢ్ పోలీస్స్టేషన్ ఇన్చార్జి పుఖారామ్ తెలిపారు. దీనిపై బాలికను, నిందితుడు పుష్పేంద్ర సింగ్ను పట్టుకున్నాం. బాలికను ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించగా, ప్రధాన నిందితుడు పుష్పేంద్ర సింగ్ను అరెస్టు చేసి జైలుకు తరలించారు. అదే సమయంలో, పరారీలో ఉన్న ఇతర నిందితులను కూడా త్వరలో అరెస్టు చేయనున్నారు.