Asianet News TeluguAsianet News Telugu

తనను అడగకుండా భర్త పానీపూరీ తెచ్చాడని... విషం తాగి భార్య ఆత్మహత్య..

అడగకుండానే పానీ పూరీని తీసుకువచ్చినందుకు భార్య విషం తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. 

man brings panipuri without asking wife, angry woman committed suicide in pune
Author
Hyderabad, First Published Sep 1, 2021, 2:46 PM IST

పూణే : మహారాష్ట్రలో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. క్షణికావేశం.. భర్త తన మాట వినలేదన్న కోపం.. ఓ మహిళ చాలా చిన్న విషయానికే ఆత్మహత్య చేసుకునేలా చేసింది. చిన్న చిన్న విషయాలకు కూడా ఈ మధ్య చాలామంది ఆత్మహత్యలకు పాల్పడి విలువైన జీవితాలను అంతం చేసుకుంటున్నారు. 

అడగకుండానే పానీ పూరీని తీసుకువచ్చినందుకు భార్య విషం తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. 

వివరాల్లోకి వెడితే.. షోలాపూర్ కు చెందిన గహినీనాథ్ సర్వదే 2019లో ప్రతిక్ష అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ఆమె భర్త పూణేలో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ప్రస్తుతం వీరు పూణేలోని అంబేగావ్ పీఠభూమి ప్రాంతంలో నివసిస్తున్నారు. 

కాగా వివాహమైనప్పటి నుంచి గహినీనాథ్ కు ప్రతీక్ష మధ్య చాలా విభేదాలు ఉన్నాయి. ఈ క్రమంలో గత శుక్రవారం గహినీనాథ్ ఆఫీసు నుంచి ఇంటికి వస్తున్న సమయంలో పానీ పూరి తీసుకుని ఇంటికి వెళ్లాడు. అయితే తనను అడకుండానే పానీ పూరిని తీసుకువచ్చినందుకు ప్రతీక్షకు కోపం వచ్చింది. 

దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో మరుసటి రోజు ప్రతీక్ష విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రతీక్ష తండ్రి ప్రకాష్, భారతి విద్యాపీఠ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి భర్త గహినీనాథ్ మీద ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన మీద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios