West Bengal: పశ్చిమ బెంగాల్లోని మాల్దా ప్రాంతంలోని మానిక్చక్లో బాంబు పేలుడు ఆ ప్రాంతంలో భయాందోళనలు సృష్టించింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.
Bomb Blast In Malda: పశ్చిమ బెంగాల్లోని మాణిక్చక్లో జరిగిన బాంబు పేలుడులో ఇద్దరు వ్యక్తులు మరణించగా, పలువురికి గాయాలయ్యాయి. ఆదివారం తెల్లవారుజామున జరిగిన నాటుబాంబు పేలుడులో ఇద్దరు వ్యక్తులు మరణించగా, మరొకరు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. మానిక్చక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జెసరత్తల బలుటోలాలోని పొలంలో బాంబులు తయారు చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలుడు సంభవించిందని తెలిపారు. తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో స్థానికులు భారీ పేలుడు శబ్దం విన్నారు. మా సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకునే సమయానికి గాయపడిన ముగ్గురిని ఆసుపత్రికి తరలించినట్లు గుర్తించారని పోలీసులు తెలిపారు. చికిత్స పొందుతూ ఇద్దరు చనిపోయారని వైద్యులు తెలిపారు. మరొకరు చికిత్స పొందుతున్నారని మాల్దా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ వర్గాలు పేర్కొన్నాయి.
పోలీసుల నుంచి అందిన సమాచారం ప్రకారం.. కొందరు వ్యక్తులు బహిరంగ మైదానంలో బాంబును కట్టేందుకు ప్రయత్నిస్తుండగా ఈ పేలుడు సంభవించింది. ఈ బాంబు పేలుడు కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారిని ఫర్జాన్ ఎస్కే (45), సఫీకుల్ ఇస్లాం (30)గా గుర్తించారు. మానిక్చక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జెసర్తల బలుటోలాలోని బహిరంగ మైదానంలో ఈ వ్యక్తులు బాంబులు తయారు చేస్తున్నారు. పెట్రోలింగ్లో ఉన్న పోలీసులకు బాంబుల శబ్ధం వినిపించిందని స్థానికులకు సమాచారం అందిందని పోలీసులు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకునే సరికి, అక్కడ కొంతమంది రక్తంతో పడి ఉన్నారు.. వారిని మానిక్చక్ ఆసుపత్రిలో చేర్చారు.
అర్ధరాత్రి బాంబు పేలుడు
ఈ బాంబు పేలుడు ఘటన తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో జరిగిందని పోలీసులు తెలిపారు. స్థానికులు భారీ పేలుడు శబ్దం విన్నారని తెలిపారు. ఈ క్రమంలోనే వారు అక్కడికి చేరుకోగా.. తీవ్రగాయాలతో అక్కడపడివున్న పలువురిని గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకునే సమయానికి స్థానికులు ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఇద్దరు మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు ప్రకటించగా, మరొకరు చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలం నుంచి బాంబు తయారీకి ఉపయోగించిన కొన్ని ముడిసరుకును కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
బాంబులు ఎందుకు తయారు చేస్తున్నారు..?
అయితే, బాంబులను తయారు చేసేందుకు వీరికి పేలుడు సామాగ్రి ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. దీంతో పాటు బాంబు తయారీ ఉద్దేశం కూడా ఆరా తీస్తున్నారు. దీంతో ఘటనకు సంబంధించిన సమాచారాన్ని బాంబ్ స్క్వాడ్కు అందించగా, ఓ బృందం అక్కడికి చేరుకుంది. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది. ఈ కేసులో ప్రమేయమున్న మరికొందరి కోసం పోలీసులు వెతుకుతున్నారు. అయితే, ఇప్పటివరకు ఎలాంటి అరెస్టులు జరగలేదని తెలిపారు. దీనిపై విచారణ జరుగుతున్నదని పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ ప్రాంతంలో ఉందని, పరిస్థితి అదుపులో ఉందని పోలీసు సూపరింటెండెంట్ ప్రదీప్ కుమార్ యాదవ్ తెలిపారు. ఇందులో ప్రమేయం ఉన్న ఇతరుల కోసం అన్వేషణ కొనసాగుతోందని, ఆ ప్రాంతం నుంచి నాలుగు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. భూముల విషయంలో అధికార టీఎంసీలో వర్గపోరు కారణంగా గత కొన్ని వారాలుగా ఈ ప్రాంతం ఉద్రిక్తంగా ఉందని స్థానికులు తెలిపారు.