శబరిమల: భక్తులకు మకరజ్యోతి దర్శనం
శబరిమలలో సోమవారం నాడు మకర జ్యోతి భక్తులకు దర్శనమించ్చింది. మకర జ్యోతి దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు సోమవారం నాడు ఆలయ పరిసరాలకు చేరుకొన్నారు.
తిరువనంతపురం: శబరిమలలో సోమవారం నాడు మకర జ్యోతి భక్తులకు దర్శనమించ్చింది. మకర జ్యోతి దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు సోమవారం నాడు ఆలయ పరిసరాలకు చేరుకొన్నారు.
పొన్నంబలమేడు కొండపై మకరజ్యోతి భక్తులకు దర్శనమిచ్చింది. జ్యోతి రూపంలో అయ్యప్ప దర్శనమిచ్చాడని భక్తులు విశ్వసిస్తారు. మకరజ్యోతిని చూసి భక్తులు పులకరించిపోయారు.
స్వామియే శరణం అయ్యప్ప అంటూ శబరిమల మార్మోగిపోయింది. ప్రతి ఏటా మకరజ్యోతి దర్శనం కోసం భక్తులు శబరిమలను వస్తారు.