మహా కుంభమేళాపై తప్పుడు ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాలపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫైర్ అయ్యారు.  

 Kumbh Mela 2025 : ప్రయాగరాజ్ మహా కుంభమేళా ముగిసేలోపే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రతిపక్షాలపై గట్టిగా విరుచుకుపడ్డారు. కుంభ్‌లో తొక్కిసలాట, గంగా జలం స్వచ్ఛతపై ప్రభుత్వంపై ప్రశ్నలు వేసిన ప్రతిపక్ష నేతలను అసెంబ్లీ సమావేశాల్లో సీఎం యోగి దుయ్యబట్టారు. ఎవరి ఫీలింగ్ ఎలా ఉంటే కుంభ్ అలా కనిపిస్తుంది యోగి ఆదిత్యనాథ్ ప్రతిపక్ష నేతలపై సెటైర్లు వేసారు.

రాబందులకు శవాలు, పందులకు మురికి కనిపిస్తుంది... కానీ మంచి మనసున్న వాళ్లకు కుంభమేళాలో బంధుత్వాలు, వ్యాపారులకు బిజినెస్, భక్తులకు శుభ్రమైన ఏర్పాట్లు కనిపిస్తాయన్నాయి. కాంగ్రెస్, లెఫ్ట్, సమాజ్‌వాదీ పార్టీ లీడర్లపై ఆయన విమర్శలు చేశారు. మహాకుంభ్‌లో సరైన ఏర్పాట్లు లేవంటూ యోగి సర్కార్‌ను ప్రతిపక్షాలు టార్గెట్ చేశాయి... ప్రతిపక్షాలు అబద్ధాలు చెబుతున్నాయి... దీంతో ప్రతిపక్షాలు అబద్ధాలు ప్రచారంపై యోగి సీరియస్ గా రియాక్ట్ అయ్యారు.

కుంభమేళా ఒక కులం వాళ్లు రావొద్దని అడ్డుకున్నారని అంటున్నారు... కానీ ఇది అస్సలు నిజం కాదన్నారు. కుంభ్‌కు ఏ కులం వాళ్లనైనా రానిస్తారు.. మంచి ఉద్దేశంతో వచ్చేవాళ్లందరికీ వెల్కమ్ చెబుతామన్నారు. కానీ గొడవలు చేయాలని చూస్తే మాత్రం వాళ్లకు తగిన శాస్తి జరుగుతుందన్నారు. మేం నమ్మకాలతో ఆటలాడలేదు అంటూ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌పై కూడా యోగి ఆదిత్యనాథ్ ఫైర్ అయ్యారు.

మీలా మేం నమ్మకాలతో ఆటలు ఆడలేదు... మీరు అధికారంలో ఉన్నప్పుడు సీఎంకు కుంభ్ ఏర్పాట్లు చూసే టైమ్ కూడా ఉండేది కాదన్నరు. అందుకే మీరు ఒక సనాతన మతానికి చెందనివారికి కుంభ్‌కు ఇన్ఛార్జ్‌గా పెట్టారని యోగి అన్నారు. కానీ మేం స్వయంగా అన్నీ చూసుకున్నాం... ఇప్పటికీ చూస్తున్నామన్నామని అన్నారు.

2013 కుంభ్ గురించి మాట్లాడుతూ.. ఆ టైంలో అవినీతి, సరైన ఏర్పాట్లు లేకపోవడం, కాలుష్యం ఎక్కువైపోయిందన్నారు. త్రివేణి సంగమం నీళ్లు స్నానం చేయడానికి కూడా పనికిరాకుండా పోయాయి. అప్పుడు మారిషస్ ప్రధాని కూడా అక్కడ స్నానం చేయడానికి ఒప్పుకోలేదన్నారు యోగి గుర్తుచేసారు.