ఎగ్జిట్ పోల్స్ : ఇండియా టుడే సర్వే.. మధ్య ప్రదేశ్ లో తిరుగులేని కమలం!
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. 7 దశల్లో జరిగిన ఎన్నికలు నేటితో ముగియడంతో ఎగ్జిట్ పోల్ ఫలితాలని వివిధ సంస్థలు వెల్లడించడం ప్రారంభిస్తున్నాయి. తాజాగా ఇండియా టుడే సంస్థ మధ్యప్రదేశ్ లో ఫలితం ఎలా ఉండబోతోందో తన సర్వే ద్వారా వివరించింది.
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. 7 దశల్లో జరిగిన ఎన్నికలు నేటితో ముగియడంతో ఎగ్జిట్ పోల్ ఫలితాలని వివిధ సంస్థలు వెల్లడించడం ప్రారంభిస్తున్నాయి. తాజాగా ఇండియా టుడే సంస్థ మధ్యప్రదేశ్ లో ఫలితం ఎలా ఉండబోతోందో తన సర్వే ద్వారా వివరించింది. మధ్యప్రదేశ్ లో బిజెపి అత్యధిక పార్లమెంట్ స్థానాలు కైవశం చేసుకోబోతున్నట్లు ఇండియా టుడే సర్వేలో వెల్లడైంది.
మధ్య ప్రదేశ్ (29)
బిజెపి : 26-28
కాంగ్రెస్ : 1-3
దేశంలోని 542 స్థానాలకు ఏడు విడతల్లో పోలింగ్ జరిగింది. చివరి విడత పోలింగ్ ఆదివారం ముగిసింది. ఆ తర్వాత ఆదివారం సాయంత్రం వివిధ మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలను వెలువరిస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు ఈ నెల 23వ తేదీన వెలువడనున్నాయి.