వారు చేస్తున్న పనిని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా... అది కాస్త వైరల్ గా మారింది.

నడి రోడ్డుపై ఓ జంట దారుణంగా ప్రవర్తించింది. రోడ్డు పై స్కూటీ పై వెళ్తూనే రొమాన్స్ చేశారు. అది నడి రోడ్డు... అందరూ చూస్తున్నారనే ఇంగితం లేదు... కాస్త అదుపుతిప్పినా.. తాము ప్రమాదానికి గురౌతాము అనే ఊహ అంతకన్నా లేకుండా పోయింది. కాగా... వారు చేస్తున్న పనిని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా... అది కాస్త వైరల్ గా మారింది. ఈ సంఘటన లక్నో నగరంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Scroll to load tweet…

లక్నో సెంట్రల్ జోన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. లక్నో నడి వీధుల్లో ఇద్దరు బండి పై రొమాన్స్ చేస్తూ.. తిరుగుతూ కనిపించారు. వీడియో నెట్టింట వైరల్ కావడంతో... పోలీసులు యాక్షన్ తీసుకోవడానికి రెడీ అయ్యారు. ఆ స్కూటీ పై తిరిగిన జంట ఎవరా అని తెలుసుకునే పనిలో పడ్డారు. వారు ఎవరో తెలియగానే...వెంటనే చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు.