సారాంశం

lover shoots girlfriend:  పెండ్లి చేసుకోవ‌డానికి నిరాక‌రించింద‌ని ప్రియురాలి పై తుపాకితో కాల్పులు జ‌రిపాడు ఓ ప్రియుడు. అనంత‌రం తానూ కాల్చుకున్నాడు. కాల్పుల అనంతరం సంఘటనా స్థలంలోని ప్రత్యక్ష సాక్షులు బాధితులిద్దరినీ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ప్రియుడు ప్రాణాలు కోల్పోగా, రెండు బుల్లెట్ గాయాలపాలైన యువ‌తి ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతోంది.  

Taregna dih masaurhi:Taregna: పెండ్లికి నిరాక‌రించింద‌ని ఒక‌ ప్రేమికుడు త‌న ప్రియురాలిపై కాల్పులు జ‌రిపాడు. ఆ తర్వాత అదే తుపాకీతో తాను కాల్చుకున్నాడు. కాల్పుల అనంతరం సంఘటనా స్థలంలోని ప్రత్యక్ష సాక్షులు బాధితులిద్దరినీ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ  ప్రియుడు ప్రాణాలు కోల్పోగా, రెండు బుల్లెట్ గాయాలపాలైన యువ‌తి ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతోంది. పీఎంసీహెచ్ (పాట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్)లో చికిత్స పొందుతున్న యువ‌తి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు, స్థానికులు వెల్ల‌డించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.. మసౌరీ సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్స్ పరిధిలో ఉన్న తరెగ్నా దిహ్ లో ఈ ఘటన జరిగింది. కాల్పుల అనంతరం సంఘటనా స్థలంలోని ప్రత్యక్ష సాక్షులు బాధితులిద్దరినీ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ కాల్పులు జ‌రిపిన‌ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, రెండు బుల్లెట్ గాయాలపాలైన యువ‌తిని ప్రాథమిక చికిత్స అనంతరం పీఎంసీహెచ్ కు తరలించారు.

మృతుడిని రాజుకుమార్ గా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అతని పొరుగింటి అమ్మాయి, రాజు ఇద్ద‌రూ కొంత‌కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే, ఆమెను పెళ్లి చేసుకోవాలన్న కోరికను వ్యక్తం చేయగా, ఆమె నిరాకరించింది. రాజు పాట్నాలోని ఓ ప్ర‌యివేటు సంస్థలో పనిచేస్తూ చ‌దువుకుంటున్నాడు. వ్యవసాయం, పశువుల పెంపకం ద్వారా ఆయన కుటుంబం జీవనం సాగిస్తోంది. అమ్మాయి ఇంటర్మీడియట్ విద్యార్థిని, ఆమె తల్లిదండ్రులకు ఏకైక సంతానం. ఆమె తండ్రి సౌదీ అరేబియాలో పనిచేస్తున్నారు.

మరో రెండు నెలల్లో అమ్మాయి పెళ్లి..

ఇప్పటికే ఆ యువతి వివాహం నిశ్చయమైందనీ, రెండు నెలల్లో పెళ్లి జరగాల్సి ఉందని సమాచారం. బాలిక కోచింగ్ ముగించుకుని తిరిగి వస్తుండగా రాజు ఆమెను ఆపేందుకు ప్రయత్నించగా ఆమె ప్రతిఘటించి పక్కకు తోసేసింది. ఈ క్ర‌మంలోనే రాజు ఆమెపై రెండు సార్లు కాల్పులు జరిపి ఆత్మహత్యకు పాల్ప‌డ్డాడు అని స్థానికులు తెలిపారు. ఈ భయానక ఘ‌ట‌న‌తో  ఇద్దరు బాధితులు రక్తపు మడుగులో నేలపై పడి ఉండగా, చుట్టుపక్కల వారు వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన రాజు కుటుంబాన్ని శోకసంద్రంలో మునిగిపోయింది. కేసు న‌మోదుచేసుకున్న పోలీసులు దీనిని వన్ సైడ్ లవ్ ఎఫైర్ గా మాసోధి పోలీస్ స్టేషన్ ఆఫీసర్ సంజయ్ కుమార్ అభివర్ణించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను రాబట్టేందుకు పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.