సింధు సూర్యకుమార్పై దుష్ప్రచారం.. వామపక్ష సానుభూతి పరుడైన మాజీ జడ్జిపై నెటిజన్స్ ఫైర్..
ఏషియానెట్ న్యూస్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సింధు సూర్యకుమార్, కేరళ ప్రభుత్వం టార్గెట్ చేస్తున్న ఇతర జర్నలిస్టులకు ఏషియానెట్ న్యూస్ గట్టి మద్దతు ఇస్తుంది. ఎలాంటి బెదిరింపులు లేదా మమ్మల్ని అణచివేయడానికి ప్రయత్నించినా, మేము నిశ్శబ్దంగా ఉండటానికి నిరాకరిస్తాం. మేము ‘‘నిజాయితీ.. నిర్భయం.. అలుపెరుగనితనం’’ ఉండాలనే దృఢమైన నిబద్ధతతో మా జర్నలిజం సాధన కొనసాగిస్తాము.
ఏషియానెట్ న్యూస్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సింధు సూర్యకుమార్పై మాజీ సబ్ జడ్జి ఎస్ సుదీప్ ఫేస్బుక్లో చేసిన అసభ్యకరమైన పోస్ట్పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు మీడియా ప్రతినిధులు, నెటిజన్లు సుదీప్ చేసిన పోస్టుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సింధు సూర్యకుమార్కు వారి మద్దతను అందిస్తున్నారు. అయితే ఈ పోస్టుకు వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్నవారిపై సుదీప్ కక్ష సాధింపును కొనసాగిస్తున్నాడు. అయితే హాస్యాస్పదంగా.. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రభుత్వం దేశ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా మెయిన్ స్ట్రీమ్, ఆన్లైన్ మీడియాను వేధింపులకు గురిచేస్తున్న సమయంలో మాత్రం దాని నుంచి దూరంగా ఉన్నారు.
సింధు సూర్యకుమార్, కేరళ ప్రభుత్వం టార్గెట్ చేస్తున్న ఇతర జర్నలిస్టులకు ఏషియానెట్ న్యూస్ గట్టి మద్దతు ఇస్తుంది. ఎలాంటి బెదిరింపులు లేదా మమ్మల్ని అణచివేయడానికి ప్రయత్నించినా, మేము నిశ్శబ్దంగా ఉండటానికి నిరాకరిస్తాం. మేము ‘‘నిజాయితీ.. నిర్భయం.. అలుపెరుగనితనం’’ ఉండాలనే దృఢమైన నిబద్ధతతో మా జర్నలిజం సాధన కొనసాగిస్తాము.
శబరిమల సమస్యపై తన పోస్ట్లకు సంబంధించి హైకోర్టు విచారణ జరిపి మందలించిన తర్వాత 2021జూన్లో సుదీప్ సబ్ జడ్జి పదవికి రాజీనామా చేశారు. సింధు సూర్యకుమార్ వీక్లీ ప్రోగ్రామ్ ‘‘కవర్ స్టోరీ’’.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం తప్పులు, అసహ్యకరమైన చర్యలపై ప్రతిబింబించిన తర్వాత సుదీప్ ఫేస్బుక్ పేజీలో పోస్టులు పెట్టడం ప్రారంభించారు. ‘‘కవర్ స్టోరీ’’ అనేది రాష్ట్ర, కేంద్ర అన్ని ప్రభుత్వాలపై పదునైన విమర్శలు, దృక్పథానికి ఎల్లప్పుడూ ప్రసిద్ధి చెందింది.
‘‘కవర్ స్టోరీ’’లో చెప్పింది తప్పని సుదీప్ సింధు సూర్యకుమార్పై విరుచుకుపడ్డారు. ఊహాజనిత పరిస్థితిని ప్రదర్శించే వేషంలో, సుదీప్ సింధు పవిత్రతను అవమానించే విధంగా సుదీర్ఘ పోస్టు రాశారు. అతని పోస్ట్.. ఏషియానెట్ న్యూస్ నాయకత్వాన్ని అపహాస్యం చేస్తుంది. అలాగే ప్రజల దృష్టిలో ఛానెల్ను తక్కువ చేసేదిగా ఉంది.
సుదీప్ పోస్ట్ అనువాదం:
పోక్సో కేసులో పరారీలో ఉన్న ఓ ప్రముఖ మహిళా జర్నలిస్టు అజ్ఞాతంలో లైంగికంగా రెచ్చిపోయారు. ఆమె తన భర్తను రహస్య ప్రదేశంలోకి రానివ్వదు..
ఎందుకంటే అతను పోలీసుల నిఘాలో ఉన్నాడు. పోలీసులు ఖచ్చితంగా అతనిపై నిఘా ఉంచుతారు. తదనంతరం ఈవెంట్ మధ్యలో జర్నలిస్టును పట్టుకుంటారు. ఇక జర్నలిస్టుకు వెంటనే లస్ట్ను చల్లార్చాలి. ఈ అంశంపై చర్చించేందుకు ఛానెల్ ఎడిటోరియల్ బోర్డు అత్యవసరంగా సమావేశమైంది. దీంతో ప్రస్తుతానికి మిల్క్ బాయ్తో సర్దుకుపోవాలని బోర్డు నిర్ణయించింది.
ఈ నిర్ణయాన్ని ఆ జర్నలిస్టు తప్పుబట్టారు. దీంతో బోర్డు చెదరగొట్టబడింది. టాప్ మీడియా వ్యక్తి స్థాయికి పాల వ్యాపారి నీళ్లు కలిపితే? చిన్నకులంత (చిన్న కుర్రాడు) విలువలను నిలబెట్టగలడా? జర్నలిస్టు ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని.. డిబాచీ ఎడిటోరియల్ బోర్డు సభ్యులు ఈ అంశంపై మళ్లీ చర్చించారు. వారు గంజాయి స్మోకింగ్ చేస్తూ మేధోమథనం చేశారు. నవద్వారాల నుంచి (మానవ శరీరంలోని తొమ్మిది రంధ్రాలు) పొగ మాత్రమే వచ్చింది. అయినప్పటికీ.. చిమ్నీ నుంచితెల్లటి పొగ వెలువడలేదు.
ఆ ఛానల్ బాస్ కి కోపం వచ్చింది. దీంతో మనస్తాపానికి గురైన దీంతో మనస్తాపానికి గురైన సెంటర్ సహన్ అనే మోసగాడు, బంగారం స్మగ్లర్ కూడా.. ‘‘ఈ విషయాన్ని నేను పరిష్కరిస్తాను. రాష్ట్రంలో ఏమీ చేయని స్వప్న-తహన్పై ఫిర్యాదును పరిష్కరించండి!’’ అని అన్నాడు.
బాస్ కళ్ళు తిప్పుతూ.. ‘‘బుర్జ్ ఖలీఫాలో మీ వ్యాపారం చూసుకోండి.. నేను దీన్ని పూర్తి చేస్తాను’’ అని అన్నాడు. దాంతో ఛానల్ బాస్ ఆ సీనియర్ జర్నలిస్ట్ గుప్త ప్రదేశానికి ఛార్టర్డ్ ఫ్లైట్లో చేరి ఆమె కోరిక తీర్చుకున్నారు. బాస్ 24x7 లైవ్ చేస్తున్నప్పటికీ.. 'ఉన్నత' ఆరు, ఆపై పన్నెండు దాటడంతో ఆమెలో ఉత్సాహం పెరగడం తప్ప ప్రత్యేకంగా ఏమీ లేదు. గౌరవం, వస్తువులతో రాత్రికి రాత్రే బాస్ దేశం విడిచి పారిపోయిన ఘటన చర్చనీయాంశమైంది.
ఈ వీధి కబుర్లు మీరందరూ ఇంతకు ముందు విన్నారా? మేము దానిని వినలేదని మీకు మరియు నాకు తెలుసు. అయితే మీకు ఛానెల్ ఉందనుకోండి. మీరు ఆ ఛానెల్లో పైన పేర్కొన్న కథనాన్ని ఈవెంట్గా, పాటగా, వార్తా కథనంగా ప్రసారం చేశారనుకోండి. (మిమ్మల్ని మీరు ఆ స్థితిలో ఊహించుకోవద్దు; మీరు నాల్గవ-రేటు ఎస్టేట్ యజమాని లేదా ఉద్యోగి కాదు కాబట్టి నీచంగా ప్రవర్తించేలా నన్ను ఊహించుకోండి). ఆ కథ మొత్తం కామంతో దావానంలా వ్యాపిస్తుంది.
మునుపటి కథ రేపు చరిత్రలో భాగమవుతుంది. భవిష్యత్తులో, ఈ కథనాన్ని అక్షరాలా ఉటంకిస్తూ శక్తిధరన్ల(దేశాభిమాని, సీపీఎం మౌత్పీస్ మాజీ ఎడిటోరియల్ బోర్డు సభ్యుడు జి శక్తిధరన్ సూచన. అతను స్నోడెన్ లాంటి మిషన్లో ఉన్నాడు) వార్తా కథనాలు, పోస్ట్లు ఉంటాయి.
ఏమీ పట్టుకోలేని స్వయం సేవకులు కథను పదే పదే చదివి నిట్టూర్చుతారు. నంబి నారాయణన్కు చెందిన పవన క్షేత్రాల గురించి ఇక్కడి మీడియా కథనాన్ని రూపొందించింది. కాబట్టి పైన పేర్కొన్న కథనాలను ఫన్నీగా భావించి నవ్వకండి.
ఈ విధంగా కథనాలు గాలి నుండి సృష్టించబడతాయి మరియు ప్రముఖ వార్తగా మారతాయి. దీని సృష్టికర్తలను మీడియా సిండికేట్ అంటారు. ఇంతకు ముందు చెప్పిన కథా రచయితలు, మీడియా సిండికేట్ కనుమరుగైపోయారని మీరు అనుకుంటే, మీరు పొరబడ్డట్టే.
దాని కథకులలో ఒకరు.. కేంద్ర మంత్రి, బీజేపీ ప్రముఖుడు రాజీవ్ చంద్రశేఖర్, ఆయన సహచరుడు కేంద్ర సహాయ మంత్రి వీ మురళీధరన్ యాజమాన్యంలోని ఆసియానెట్ ఛానెల్కు ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అయిన సింధు సూర్యకుమార్.
మొన్ననే తమకంటూ ఓ కథను రూపొందించి ‘అంగడిపట్టు’ అంటూ వార్తలొచ్చాయి. ఆ మూర్ఖపు కథ ఏంటంటే.. ‘‘రాజకీయ అధికారం ఉన్న తాత, అమ్మమ్మ విదేశాలకు వెళ్లి దుబాయ్కి వచ్చారు. ఒక వారం తరువాత, వారిని కలవడానికి చాలా ఉత్సాహంగా ఉన్న వారి మనవడిని ఒక పెద్ద వ్యాపారవేత్త ఖర్చుతో బిజినెస్ క్లాస్లో దుబాయ్కు తీసుకువచ్చారు. ఇది చర్చకు దారితీసింది’’.
శ్రీమతి సింధు అక్కడితో ఆగకుండా ఇలా అన్నారు: ‘‘మేము ఈ విషయాలను బహిర్గతం చేయడానికి ప్రయత్నిస్తే, కొంతమంది నాయకులు అని పిలువబడే వారి అభిమానులు తమను కించపరిచే ప్రయత్నమని దాడికి దిగుతారు.’’
సింధు, ఆమె ఛానెల్ straight, bold, relentless ఉండాలని విశ్వసిస్తే.. వారి స్వంత వార్తల పితృత్వంపై కొంచెం నమ్మకం ఉంటే, వారు ఆ తాత పేరును ప్రస్తావించి ఉండాలి. వార్త పితృత్వాన్ని నిర్ధారించుకోకుండా ఒకరి స్వంత వార్తలను అందించడాన్ని మీడియా యాక్టివిటీ అంటారు. దీని పేరును కామ్రేడ్ ఎం స్వరాజ్ చాలా కాలం క్రితం ప్రస్తావించారు.
సింధును కళ్లద్దాలు లేని స్వప్న సురేష్ అని మనం అనము; స్వప్న కూడా పరువు నష్టం నోటీసు పంపుతుంది. ఇప్పుడు మేము సంధించే ప్రశ్నలకు సమాధానాలు లేనప్పుడు సింధు, ఆమె బృందం పెద్ద ఎత్తున కేకలు వేస్తుంది. దీనిని సైబర్ దాడి అని పిలుస్తారు. ఆమె మితవాద గూండాలను మాటలతో దుర్భాషలాడేందుకు నియమిస్తుంది. అది నా సోషల్ మీడియా ఖాతాకు జోడించబడుతుంది.
మరునాడన్ అజ్ఞాతంలో ఉన్నాడని ఎవరు చెప్పారు? సింధు అనేది షాజన్ స్కరియా చురీదార్-ధరించిన వెర్షన్ (రిఫరెన్స్ మరునాదన్ మలయాళీ ఎడిటర్, యజమాని.. ఇది అపూర్వమైన అణిచివేతను ఎదుర్కొంటున్న ఆన్లైన్ ఛానెల్).
ఇదిలా ఉంటే, సుదీప్ సబ్ జడ్జిగా విధులు నిర్వహిస్తున్న సమయంలో శబరిమల సమస్యపై, కేంద్రంపై తన నిరసనను సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేశారు. దీంతో ఆయనపై పలు పిటిషన్లు హైకోర్టుకు చేరుకున్నాయి. విచారణ కమిటీ క్రమశిక్షణా చర్యలకు ఆదేశించింది. దీంతో సుదీప్ న్యాయ సేవకు రాజీనామా చేశారు. అతను అప్పటి నుండి వామపక్షాలకు వ్యతిరేకంగా మాట్లాడే ఎవరిపైనా, దేనిపైనా తన తీవ్రమైన దాడితో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారు.