Asianet News TeluguAsianet News Telugu

కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి బొమ్మ ముద్రించాలి: సుబ్రమణ్యస్వామి

భారతీయ కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవీ బొమ్మను ముద్రించడం వల్ల మేలు జరుగుతుందని బీజేపీ నేత, ఎంపీ సుబ్రమణ్యస్వామి  చెప్పారు.

Lakshmi on banknotes may improve condition of Indian currency: Subramanian Swamy
Author
Madhya Pradesh, First Published Jan 16, 2020, 11:27 AM IST

న్యూఢిల్లీ: భారతీయ కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవీ బొమ్మను ముద్రించడం వల్ల మేలు జరుగుతుందని బీజేపీ నేత, ఎంపీ సుబ్రమణ్యస్వామి  చెప్పారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా సుబ్రమణ్యస్వామి మీడియాతో మాట్లాడారు. 

also read:నాలుగేళ్ల ప్లాన్: పవన్‌తో చర్చలపై బీజేపీ ఎంపీ జీవీఎల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఇండోనేషియా కరెన్సీపై గణేశుని బొమ్మ ముద్రించడాన్ని విలేకరులు ఆయన వద్ద ప్రస్తావించినపుడు స్వామి మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలన్నారు. ఈ రకమైన విధానానికి తాను అనుకూలమని సుబ్రమణ్యస్వామి చెప్పారు. 

గణేషుడు విఘ్నాలను తొలగిస్తాడన్నారు. లక్ష్మీదేవీ బొమ్మను కరెన్సీ నోట్లపై ముద్రిస్తే భారతీయ కరెన్సీ పరిస్థితి మరింత మెరుగుపడే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.ఇండోనేషియాలో గణేషుడి బొమ్మ ముద్రించడం వల్ల ఆ దేశంలో విఘ్నాలు తొలగిపోయినట్టుగా సుబ్రమణ్యస్వామి అభిప్రాయపడ్డారు. 

Follow Us:
Download App:
  • android
  • ios