Asianet News TeluguAsianet News Telugu

Ladakh Bus Accident: "వీర సైనికుల‌ను కోల్పోయం.. " ప్రధాని మోదీ సంతాపం

Ladakh Bus Accident: లడఖ్ బ‌స్సు ప్ర‌మాదంలో  ఏడు మంది సైనికులు మరణించడం ప‌ట్ల‌ ప్రధాని మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మ‌నం వీర సైనికులను కోల్పోయామని, మృతుల కుటుంబాలకు సానుభూతి ప్ర‌క‌టించారు. గాయ‌ప‌డిన వారు వీలైనంత త్వరగా కోలుకోవాల‌ని ప్రార్థించారు. సైనికుల మృతి ప‌ట్ల కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ సంతాపం వ్య‌క్తం చేశారు
 

Ladakh Bus Accident PM, Amit Shah, Rajnath Singh Condole Soldiers Deaths
Author
Hyderabad, First Published May 28, 2022, 2:32 AM IST

Ladakh Bus Accident:  లడఖ్‌లో జరిగిన బ‌స్సు ప్రమాదంలో ఏడుగురు సైనికులు మరణించడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గాయపడిన సైనికులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. లడఖ్‌ తుర్టుక్ సెక్టార్‌లోని ట్రాన్సిట్ క్యాంప్ నుంచి 26 మంది సైనికుల బృందం సబ్ సెక్టార్ హనీఫ్ కు వెళ్తున్న బస్సు అదుపు త‌ప్పి ష్యోక్ నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఏడు మంది సైనికులు మ‌ర‌ణించ‌గా..పలువురు సైనికులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ఆర్మీ జవాన్లను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన సైనికులను పశ్చిమ కమాండ్‌కు తరలించేందుకు భారత వైమానిక దళం నుంచి ఆర్మీ సహాయాన్ని కోరింది.

లడఖ్ ప్రమాదంపై ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ.. 'లడఖ్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో వీర సైనికులను కోల్పోయినందుకు చాలా బాధపడుతున్నాను. మృతుల కుటుంబాలకు నా సానుభూతి. గాయపడిన సైనికులు ఉంటారని ఆశిస్తున్నాను. వారు వీలైనంత త్వరగా కోలుకోవాల‌ని ఆశిస్తున్నాను.  బాధితుల‌కు అన్ని విధాలా సహాయం అంద‌జేస్తాం" అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. 

 

ఇదిలావుండగా, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ కూడా ప్రమాదంపై తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. గాయపడిన ఆర్మీ సిబ్బంది త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. "లడఖ్‌లో ఇండియన్ ఆర్మీ బస్సు నదిలో పడిపోవడం  చాలా బాధాకరం. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్ల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడిన వారిని సత్వర చికిత్స కోసం తరలించారు. వారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను' అని షా ట్వీట్‌లో పేర్కొన్నారు.

లడఖ్ బస్సు ప్రమాదంలో సైనికుల మృతిపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. 'లడఖ్‌లో జరిగిన బస్సు ప్రమాదం కారణంగా, మన వీర భారత ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు, ఇది చాలా బాధాకరం. మన దేశానికి వారు చేసిన సేవను ఎప్పటికీ మరువలేం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన జవాన్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను ' అని 
సంతాపం తెలిపారు. అలాగే.. తాను ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండేతో మాట్లాడాననీ, అతను పరిస్థితిని వివరించార‌నీ, గాయపడిన సైనికులకు మెరుగైన వైద్య సేవ‌లందిస్తున్న‌ట్టు తెలిపారు. గాయపడిన జవాన్లకు సైన్యం అన్ని విధాలా సాయం చేస్తోందని రక్షణ మంత్రి తెలిపారు.

మరోవైపు, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ట్వీట్ చేస్తూ.. లడఖ్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో మన వీర సైనికుల అమరవీరుల గురించి తెలిసి చాలా బాధపడ్డాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. దేశం కోసం సైనికుల నిస్వార్థ సేవ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అని రాసుకోచ్చారు. 

ప్రమాదం ఎలా జరిగింది?

లడఖ్‌లోని తుర్టుక్ సెక్టార్‌లో శుక్రవారం ఉదయం 9 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. బస్సు దాదాపు 50-60 అడుగుల లోతుకు పడిపోయింది.  ప్ర‌మాదం స‌మ‌యంలో బస్సులో 26 మంది సైనికులు  ప్రయాణిస్తున్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఏడుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. అయితే మిగిలిన జవాన్ల పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులకు అన్ని రకాల వైద్య సదుపాయాలు కల్పిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వాస్తవానికి బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్ల అదుపుతప్పి నదిలో పడిపోయింది.

Follow Us:
Download App:
  • android
  • ios