ఓ యువతి ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన 23 ఏళ్ల యువకుడికి కేరళలోని కొచ్చిలోని ప్రత్యేక కోర్టు 18 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ప్రత్యేక పోక్సో కోర్టు జడ్జీ .. నిందితుడికి పలు సెషన్ల కింద విడివిడిగా శిక్షలు విధించారు. అలాగే  1.20 లక్షల రూపాయల జరిమానా కూడా విధించారు.

యువతి ఆత్మహత్య కారకుడైన యువకుడికి కేరళలోని కొచ్చిలోని ప్రత్యేక కోర్టు సంచలన శిక్ష విధించింది. యువతి ఆత్మహత్యకు పాల్పడేలా చేయడం, బహిరంగంగా చంపేస్తానని బెదిరించడం, ఆత్మహత్యకు సహకరించినందుకు గాను 23 ఏళ్ల యువకుడికి కేరళలోని కొచ్చిలోని ప్రత్యేక కోర్టు 18 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ప్రత్యేక పోక్సో కోర్టు జడ్జి . నిందితుడికి భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి) సెక్షన్ల కింద విడివిడిగా శిక్షలు విధించారు. అదే సమయంలో నిందితుడికి రూ. 1.20 లక్షల జరిమానా కూడా విధించారు.

అయితే.. వివిధ అభియోగాలకు సంబంధించిన జైలు శిక్షలు ఏకకాలంలో అమలు చేయాలని కోర్టు ఆదేశించినందున దోషికి గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్ష మాత్రమే ఉంటుందని ప్రాసిక్యూటర్ తెలిపారు. ఎర్నాకులం నివాసి ఆత్మహత్యకు ప్రేరేపించడం, బహిరంగంగా బాలికను చంపేస్తానని బెదిరించడం, ఆమెపై వేధింపులు, దాడి చేయడం వంటి ఇతర అభియోగాలతో పాటుగా శిక్ష విధించబడింది.

అసలేం జరిగింది.

ప్రాసిక్యూషన్ ప్రకారం.. దోషి 2020 మార్చిలో పాఠశాలకు వెళుతున్న 17 ఏళ్ల బాలికను ఆపడానికి ప్రయత్నించాడు. చంపేస్తానని బెదిరించాడు. నిందితుల నుంచి ప్రాణహాని ఉందన్న భయంతో బాలిక అదే రోజు సాయంత్రం నిప్పంటించుకుని, కొన్ని రోజుల తర్వాత ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చిక్సిత పొందుతూ చనిపోయింది. ప్రాసిక్యూషన్ తరపున హాజరైన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పిఎ బిందు, న్యాయవాది సరుణ్ మాంగ్రా మాట్లాడుతూ.. బాధితురాలు మరణిస్తున్న డిక్లరేషన్‌ను, ఆమె స్నేహితుడు ఇచ్చిన వాంగ్మూలాన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు ..నిందితుడ్ని దోషిగా నిర్ధారించి శిక్ష విధించిందని తెలిపారు. ప్రాసిక్యూషన్ ప్రకారం, దోషి క్షమభిక్షకు అర్హుడు కాదని కోర్టు పేర్కొంది.