Asianet News TeluguAsianet News Telugu

వివాహేతర సంబంధం..  ఇంటికి రావొద్దని ప్రియుడికి వార్నింగ్.. తన మాట లెక్క చేయక పోవడంతో..

వివాహేతర సంబంధాల మోజులో పడి తమ పచ్చని కాపురాలను నాశనం చేసుకుంటున్నారు. తమ కుటుంబ పరువును రోడ్డు కీడుస్తున్నారు. తాజాగా భర్త చనిపోవడంతో ఓ మహిళ పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని ఏర్పర్చుకుంది. కానీ ఆ విషయం తన ఇంట్లో తెలియడంతో అతడ్ని అత్యంత దారుణంగా హతమార్చింది. 

Karnataka Married Woman Kills Lover Over Extra Marital Affair KRJ
Author
First Published Aug 17, 2023, 5:25 PM IST

కొందరు  వివాహేతర సంబంధాల మోజులో పడి తమ పచ్చని కాపురాలను  చేజేతులారా నాశనం చేసుకుంటున్నారు. తమ కుటుంబ పరువును రోడ్డు కీడుస్తున్నారు. తాజాగా భర్త చనిపోవడంతో ఓ మహిళ పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని ఏర్పర్చుకుంది. ఈ విషయం తన కుటుంబంలో తెలియడంతో ఆమెను తీవ్రంగా మందలించారు. దీంతో తన ప్రియుడిని దూరం పెట్టాలని భావించింంది. కానీ ఆ ప్రియుడు మాత్రం ఆమెను వదులుకోలేకపోయాడు. ఈ క్రమంలో ఆ ప్రియుడ్ని తన బంధువుతో కలిసి తీవ్రంగా కొట్టి హతమార్చింది. ఈ ఘటన కర్ణాటకలోని హోసూర్ ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హోసూర్ లోని బేరికే సమీపంలోని కోలాదాసపురం గ్రామానికి చెందిన జ్యోతి  అంగన్వాడీ టీచర్ గా పనిచేస్తుంది. అయితే.. ఆమె భర్త కేశవమూర్తి పది ఏళ్ల క్రితమే మృతి చెందాడు. దీంతో కుటుంబ భారం మొత్తం జ్యోతి పై పడింది. ఈ క్రమంలో మహాదేవపురం అనే గ్రామానికి చెందిన వెంకటేష్ అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధం గా మారింది. 

దీంతో వెంకటేష్ తరచూ జ్యోతి ఇంటికి వస్తూ వెళ్తుండేవాడు. ఈ విషయం ఆ నోట ఈ నోట.. జ్యోతి బంధువులకు తెలిసింది. దీంతో జ్యోతి దూరపు బంధువైన హరీష్ అనే యువకుడు.. ఆమె తీవ్రంగా మందలించాడు. మరోసారి జ్యోతి ఇంటికి రావద్దని వెంకటేష్ ని కూడా హెచ్చరించాడు. కానీ వెంకటేష్ ఆ విషయాన్ని పట్టించుకోకుండా.. జ్యోతి ఇంటికి వచ్చాడు. దీంతో ఆగ్రహం వ్యక్తంచేస్తూ ..హరీష్, జ్యోతిలు కలిసి వెంకటేష్ పై తీవ్రంగా దాడి చేశారు. అనంతరం తీవ్రంగా గాయపడిన వెంకటేష్ ను సమీప ఆసుపత్రికి తరలించారు. కానీ చికిత్స పొందుతూ వెంకటేష్ మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని జ్యోతి, హరీష్ లను అరెస్టు చేశారు

ఇదే సమయంలో కర్ణాటకలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. కృష్ణగిరి సమీపంలో వివాహేతర సంబంధం కారణంగా ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య, ప్రియుడు జైలు పాలయ్యారు. వివరాల ప్రకారం.. మహారాజగడ సమీపంలోని కళ్లనాయకనపాళ్యం గ్రామానికి చెందిన మైఖేల్ రాజ్ (36) అనే కూలీ ఆదివారం నాడు అదే ప్రాంతంలోని ఓ వ్యవసాయ బావిలో శవమై కనిపించాడు. గ్రామపెద్ద తంగరాజ్ మహరాజగడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు.

విచారణలో అదే ప్రాంతానికి చెందిన విక్రమ్ (19)కి అతని భార్య జోస్పిన్ సింధు (28)తో అక్రమ సంబంధం ఉందని, వారి ఆనందానికి అడ్డుగా ఉన్నాడని, దీంతో వారిద్దరూ మైఖేల్ రాజ్‌ను ఇంట్లోనే హత్య చేసి బావి పడేసినట్లు తెలిసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు జోస్పిన్‌సింధు, విక్రమ్‌లను అదుపులోకి తీసుకుని విచారించారు.

Follow Us:
Download App:
  • android
  • ios