Karnataka: ఉక్రెయిన్ నుండి కర్ణాటక కు తిరిగి వచ్చిన సుమారు 700 మంది వైద్య విద్యార్థులు తమ విద్యను కొనసాగించడానికి కర్ణాటక ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. కర్నాటకలోని 60 కళాశాలల్లో వారి చదువును కొనసాగించేందుకు ప్రభుత్వం సహాయంగా నిలువనున్నది.
Karnataka: ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర చేస్తున్న నేపథ్యంలో ఉక్రెయిన్ లో వైద్య విద్యాను అభ్యసిస్తున్న విద్యార్థులందరూ స్వదేశానికి తిరిగి వచ్చారు. ప్రాణాలతో ఎలాగోలా యుద్ద భూమి నుంచి ప్రాణాలతో భయపడ్డారు. కానీ, వారి పరిస్థితి ఆందోళన కరంగా ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉక్రెయిన్ వెళ్లి చదువుకునే పరిస్థితి లేదు. అలా అని తమకు నచ్చిన వైద్య విద్యను వదిలి వేయలేరు. దీంతో వారి చదువు ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయంపై కర్ణాటక ప్రభుత్వం స్పందించింది. ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన విద్యార్థులు తన వైద్య విద్యను కొనసాగించడానికి కర్ణాటక ప్రభుత్వం సహాయం చేస్తుంది. ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన దాదాపు 700 మంది విద్యార్థులకు రాష్ట్రంలోని 60 కళాశాలల్లో తమ చదువులు కొనసాగించేలా కర్ణాటక ప్రభుత్వం చర్చలు చేపట్టింది.
ఈ నేపథ్యంలో ఆరోగ్య, వైద్య విద్యాశాఖ మంత్రి కె సుధాకర్ విధానసౌధలో సోమవారం విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల తమ చదువును కొనసాగించాలనే లక్ష్యంతో విద్యార్థులు తమ వైద్య విద్యను కొనసాగించడానికి కర్ణాటక ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందనీ, కర్నాటకలోని 60 కళాశాలల్లో వారి చదువును కొనసాగించేందుకు ప్రభుత్వం సహాయం చేయబోతుందని ఆరోగ్య, వైద్య విద్యాశాఖ మంత్రి కె సుధాకర్ చెప్పారు. అలాగే.. విద్యార్థుల నుంచి ఎలాంటి అదనపు రుసుము వసూలు చేయబోమని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును పరిశీలించేందుకు ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేశారు.
అనంతరం మంత్రి కె సుధాకర్ మీడియాతో మాట్లాడుతూ.. ఉక్రెయిన్ వైద్య విద్యార్థుల సమస్యపై .. వైద్య విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్, డైరెక్టర్లతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఈ కమిటీ విద్యార్థుల విద్యా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అన్ని అంశాలను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేస్తుంది. నివేదిక ఆధారంగా, విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసి). కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తుంది.
‘‘యుద్ధం త్వరలో ముగియాలని మేమంతా ఆశాభావంతో ఉన్నాం, ప్రార్థిస్తున్నాం. ఉక్రెయిన్లో భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి, పరిస్థితులను బట్టి తగిన నిర్ణయాలు తీసుకుంటాం. విద్యార్థుల ఆలోచనా విధానాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. మరియు ప్రస్తుతం ఉన్న చట్టపరమైన మరియు నియంత్రణ ఫ్రేమ్వర్క్లో సాధ్యమైనంత ఉత్తమమైన నిర్ణయం తీసుకోండి" అని ఆరోగ్య, వైద్య విద్యాశాఖ మంత్రి కె సుధాకర్ అన్నారు.
వైద్య విద్యార్థులతో మాట్లాడాను, వారి సమస్యలను విన్నాను. వారి బాధలను పంచుకున్నాను, కేవలం ఒక మంత్రిగా మాత్రమే కాదు, వారి భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్ననని తెలిపారు. విద్యార్థులను యుద్ద భూమి నుంచి తీసుకరాగలగడం.. చాలా సంతోషంగా , ఉపశమనంగా ఉందని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు, దేశ వైద్య విద్యా వ్యవస్థను పునరుద్ధరించేందుకు ప్రధాని మోదీ ఇప్పటికే అనేక చర్యలు చేపట్టారని సుధాకర్ తెలిపారు.
