PUBGపై విధించిన నిషేధం న్యాయమేనని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. డిజిటల్ పర్సనల్ ప్రొటెక్షన్ డేటా బిల్లును వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు  

వీడియో గేమ్ లవర్స్ కు పెద్దగా పరిచయం అక్కర్లేని గేమ్ పబ్‌జీ. ఒకసారి ఈ గేమ్ ఆడితే చాలు.. మళ్లీ మళ్లీ ఆడాలనిపిస్తుంది. ఎంతటివారైన సరే పబ్ జీ గేమ్ కు అడిక్ట్ అవ్వాల్సిందే. ఇంతలా  పాపులర్ అయిన ఆన్ లైన్ మల్టీప్లేయర్ పబ్‌జీ వీడియో గేమ్ పై కేంద్రం నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఆ సంచలన నిర్ణయంపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ క్లారిటీ ఇచ్చారు. 

ఓ ప్రముఖ యూట్యూబర్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో  కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ..  భారత్ లో PUBGని ఎందుకు నిషేధించాలని ప్రభుత్వం ఎందుకు నిర్ణయించిందో తెలిపారు.  పౌరుల ప్రయోజనాలను, వారి హక్కులను కాపాడటానికి భారతదేశంలో PUBG ని నిషేధించారని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు.

కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. " PUBGపై నిషేధం ఎందుకు విధించమంటే.. ఇది ప్రజల పట్ల ప్రభుత్వ బాధ్యత, ప్రజలందరికీ ఇంటర్నెట్‌ను సురక్షితంగా చేయడం మా కర్తవ్యం. మేము ఆవిష్కరణలను ఇష్టపడుతున్నాము. భారతీయ ప్రజలందరికీ సురక్షితమైన ఇంటర్నెట్‌ని మేము కోరుకుంటున్నాము. PUBGపై నిషేధాన్ని భారత సమాజం సమర్థిస్తుంది.  కానీ, BGMI నిషేధించబడలేదు. యుద్దభూమి గేమింగ్‌ను ఇష్టపడే వ్యక్తులు దానితో సంతోషంగా ఉన్నారు. గేమ్ హానికరం కాకూడదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాబోయే ఐదేళ్లలో మరిన్ని భారతీయ గేమ్ కంపెనీలు ముందుకు రావాలని కోరుకుంటున్నారు. దేశ చరిత్ర , సంస్కృతిని ప్రతిబింబించేలా భారతీయులు తయారు చేసిన గేమ్ ల  అభివృద్ధిని కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. "అని తెలిపారు.

అలాగే.. గేమ్స్ , గేమింగ్ యాప్‌లపై  జోక్యంపై అడిగగా.. యువకులు గేమ్స్ ను తమ జీవితంలో , జీవనశైలిలో భాగమని భావిస్తున్నారని మంత్రి అంగీకరించారు. అలాగే..నూతన గేమింగ్ చట్టాల గురించి మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. వర్షాకాల సమావేశాల్లో తాము డిజిటల్ డేటా బిల్లును తీసుకురాబోతున్నామని తెలిపారు. దీని వలన భారతదేశం నుండి డేటాను సేకరించే అన్ని కంపెనీలు తమ ప్రవర్తనను మార్చుకోవాలనీ, ప్రజలు వ్యక్తిగత డేటాను ఎగుమతి చేయలేరనీ, అలాగే వారి డేటాను దుర్వినియోగం చేయలేరని తెలిపారు. బిల్లు తర్వాత ఆమోదించబడింది, వ్యక్తిగత డేటాను దుర్వినియోగం చేయడం ద్వారా ఎవరూ దోపిడీకి గురి కాలేరని తెలిపారు. అలాగే.. రాబోయే మూడు నుండి నాలుగు సంవత్సరాలలో భారత్ లో బహుళ-బిలియన్ డాలర్ల గేమింగ్ వ్యవస్థాపకులు , స్టార్టప్‌లు నెలకొల్పబడుతాయనే ఆశభావం వ్యక్తం చేశారు.