భారత్‌లో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. వ్యాక్సినేషన్‌‌లో భారత్ సరికొత్త రికార్డులను సృష్టిస్తున్న సంగతిత తెలిసిందే. ఇప్పటికే అర్హులైన దేశ జనాభాలో సగం మంది రెండు డోసుల పంపిణీ పూర్తి చేసిన సంగతి తెలిసిందే.

భారత్‌లో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. వ్యాక్సినేషన్‌‌లో భారత్ సరికొత్త రికార్డులను సృష్టిస్తున్న సంగతిత తెలిసిందే. ఇప్పటికే అర్హులైన దేశ జనాభాలో సగం మంది రెండు డోసుల పంపిణీ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా IANS-CVoter కోవిడ్ వ్యాక్సిన్ ట్రాకర్ సర్వే ప్రకారం.. అర్హత గత జనాభాలో 98 శాతం కంటే ఎక్కువ మంది కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా టీకాలు వేయించుకోవడానికి సముఖత చూపుతున్నట్టుగా తేలింది. దేశంలోని 90 కోట్ల మంది వయోజన జనాభాలో.. 81 కోట్ల మందికి పైగా ప్రజలు కోవిడ్-19 వ్యాక్సిన్‌ ఫస్ట్ డోస్ పొందారు. ప్రపంచంలోనే వ్యాక్సిన్ తీసుకోవడానికి జనాలు సానుకూలత వ్యక్తం చేస్తున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో నిలిచింది.

ఐఏఎన్‌ఎస్- సీ ఓటర్ కోవిడ్ వ్యాక్రిన్ ట్రాకర్ పరిశోధనలు ప్రకారం.. వ్యాక్సిన్ వేయించుకుని 9 కోట్ల మందిలో.. 7.5 కోట్ల మంది కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుని వైరస్ నుంచి రక్షణ పొందాలని భావిస్తున్నవవారేనని తేలింది. కేవలం 1.5 కోట్ల మంది మాత్రమే వ్యాక్సిన్ తీసుకోవడానికి ఇష్టపడటం లేదని గుర్తించింది. అయితే వారికి వివిధ కారణాలు ఉన్నాయని తెలిపింది. అయితే టీకా వేయించుకోవడానికి నిరాకరిస్తున్నవారు కూడా పూర్తిగా కఠినంగా లేరని తెలిపింది. వారిలో చాలా మందిని ఆరోగ్య సిబ్బంది ఒకటి లేదని రెండు సెషన్ల కౌన్సిలింగ్ ద్వారా టీకా తీసుకోవడానికి సులభంగా ఒప్పించవచ్చని తెలిపింది. 

ఇక, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణంకాల ప్రకారం.. దేశంలో ప్రతి రోజూ సగటున 60 నుంచి 70 లక్షల డోసుల కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ జరుగుతుంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇలాగే వేగవంతంగా కొనసాగితే.. ఈ నెలఖారు నాటికి దేశ వయోజన జనాభా మొత్తానికి ఫస్ట్ డోస్‌ టీకాలు పూర్తిచేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భారతదేశంతో పోలిస్తే.. ఐరోపా దేశాలు యుఎస్‌లో వ్యాక్సిన్‌పై సందేహం చాలా ఎక్కువ.