కరోనా ఎఫెక్ట్: ఐఐటీ జేఈఈ మెయిన్స్ పరీక్షల వాయిదా
కరోనా కేసుల పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని ఈ మాసంలో నిర్వహించాల్సిన ఐఐటీ జేఈఈ మెయిన్స్ పరీక్షలను వాయిదా వేశారు.
న్యూఢిల్లీ: కరోనా కేసుల పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని ఈ మాసంలో నిర్వహించాల్సిన ఐఐటీ జేఈఈ మెయిన్స్ పరీక్షలను వాయిదా వేశారు. ఐఐటీ జేఈఈ మెయిన్స్ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలను ఈ నెల 27 నుండి 30 వరకు నిర్వహించాలని తొలుత కేంద్రం నిర్ణయం తీసుకొన్నారు.
అయితే కరోనా కేసులు పెరిగిపోవడంతో ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టుగా కేంద్ర విద్యశాఖ మంత్రి రమేష్ పొఖ్రియాల్ ఆదివారం నాడు ప్రకటించారు. విద్యార్ధుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకొన్నామని ఆయన చెప్పారు.ఈ పరీక్షలు ఎప్పుడు నిర్వహస్తామనే విషయాన్ని తర్వాత ప్రకటిస్తామన్నారు. పరీక్షలకు కనీసం 15 రోజుల ముందు తేదీలను ప్రకటిస్తామని ఆయన తెలిపారు.