Dog walking IAS transferred: త్యాగరాజ్ స్టేడియంలో 'డాగ్ వాక్' వివాదంలో ఢిల్లీ ప్రభుత్వం రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పనిచేస్తున్న IAS సంజీవ్ ఖిర్వార్పై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA) భారీ చర్యలు తీసుకుంది. ఆయనను ఢిల్లీ నుండి లడఖ్కు బదిలీ చేసింది. అదే సమయంలో, అతని భార్య IAS అధికారి రింకు దుగ్గా కూడా అరుణాచల్ ప్రదేశ్కు బదిలీ చేసింది.
Dog walking IAS transferred: త్యాగరాజ్ స్టేడియంలో 'డాగ్ వాక్' వివాదం వివాదస్పదంగా మరడంతో కేంద్రం హోం మంత్రిత్వ శాఖ (MHA) ఆగ్రహం వ్యక్తం చేసింది.స్టేడియంలో సౌకర్యాల దుర్వినియోగానికి సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గా పని చేస్తున్నIAS సంజీవ్ ఖిర్వార్పై భారీ చర్యలు తీసుకుంది. IAS సంజీవ్ ఖిర్వార్ను ఢిల్లీ నుండి లడఖ్కు బదిలీ చేసింది. అదే సమయంలో, అతని భార్య ఐఎఎస్ అధికారి రింకు దుగ్గా కూడా అరుణాచల్ ప్రదేశ్కు బదిలీ చేసింది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA).
ఆరోపణలు ఎదుర్కొన్న ఐఏఎస్ అధికారి ఎవరు?
IAS అధికారి సంజీవ్ ఖిర్వార్ అతను 1994 బ్యాచ్ అధికారి, ప్రస్తుతం ఢిల్లీలో రెవెన్యూ కమిషనర్గా పనిచేస్తున్నారు. ఢిల్లీ డీఎంలందరూ ఆయన ఆధ్వర్యంలోనే పనిచేస్తున్నారు. అలాగే, ఆయన ఢిల్లీ పర్యావరణ శాఖ కార్యదర్శిగా కూడా ఉన్నారు. ఖిర్వార్ బి-టెక్ కంప్యూటర్ ఇంజినీరింగ్ చేశారు. అతను ఆర్థికశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని కూడా కలిగి ఉన్నాడు. అతను చండీగఢ్లో SDMగా తన కెరీర్ను ప్రారంభించాడు. IAS అధికారి సంజీవ్ ఖిర్వార్ గతంతో ఢిల్లీ, గోవా, అండమాన్ మరియు నికోబార్, అరుణాచల్ ప్రదేశ్తో పాటు భారత ప్రభుత్వంలో అనేక ముఖ్యమైన పదవులను నిర్వహించాడు. అలాగే గతంలో ఢిల్లీలో ట్రేడ్ అండ్ ట్యాక్స్ కమిషనర్గా కూడా పనిచేశారు.
అసలు వివాదమేమిటంటే..!
IAS అధికారి సంజీవ్ ఖిర్వార్ తన సతీ సమేతంగా.. తమ పెంపుడు కుక్కను తీసుకుని స్టేడియానికి ఈవినింగ్ వాక్ రావడం. ఇలా చేయడం వల్ల.. గతంలో రాత్రి 8 లేదా 8.30 గంటల వరకు శిక్షణ తీసుకునే అథ్లెట్లు.. వారి వ్యవహరంతో రాత్రి 7 గంటలకే అక్కడి నుంచి వెళ్లిపోవాలని స్టేడియం సిబ్బంది క్రీడాకారులను ఆదేశిస్తున్నారు. తనపై వచ్చిన ఆరోపణలను ఖిర్వార్ ఖండించారు. తన నడక అథ్లెట్ల ప్రాక్టీస్కు ఎలాంటి ఇబ్బంది కలిగించదని కొట్టిపారేశాడు. స్టేడియం అడ్మినిస్ట్రేటర్ అనిల్ చౌదరి కూడా ఆరోపణలను ఖండించారు.
ఈ విషయం వెలుగులోకి రావడంతో ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై క్రీడాకారులు, క్రీడాకారులు తదితరుల కోసం స్టేడియాలు రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అధికారిక సమయాలను అనుసరిస్తున్నారని చెప్పారు. అథ్లెట్లకు అధికారిక శిక్షణ సమయం రాత్రి 7 గంటల వరకు ఉంటుందని తెలిపారు. ఆ తర్వాత, కోచ్ మరియు అథ్లెట్ వెళ్లిపోతారు. ఎవ్వరూ తొందరగా వెళ్లిపోవాలని కోరలేదు.
ఈ స్టేడియం 2010 కామన్వెల్త్ గేమ్స్ కోసం నిర్మించబడిన విషయం తెలిసిందే.. ఈ క్రీడా సముదాయం అనేక సౌకర్యాలతో కూడిన గొప్ప స్టేడియం. జాతీయ, రాష్ట్ర అథ్లెట్లు, పుట్బాల్ క్రీడాకారులు ఇక్కడ శిక్షణ మరియు సాధన చేస్తారు.
