రాజస్థాన్లో కూలిన ఐఎఎఫ్-21 విమానం: పైలట్ సురక్షితం
రాజస్థాన్ రాష్ట్రంలోని బికనీర్లో మిగ్ 21 విమానం శుక్రవారం నాడు కూలిపోయింది. ఈ ఘటనలో పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు.
జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలోని బికనీర్లో మిగ్ 21 విమానం శుక్రవారం నాడు కూలిపోయింది. ఈ ఘటనలో పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు.
రాజస్థాన్ రాష్ట్రంలోని శోభసర్ ధాని ప్రాంతంలో మిగ్ 21 విమానం కూలిపోయినట్టుగా బికనీర్ ఎస్పీ ప్రకటించారు. మిగ్-17 విమానం కుప్పకూలిన వారం రోజులకే ఈ విమానం కూలడం గమనార్హం.