Asianet News TeluguAsianet News Telugu

రాజస్థాన్ లో కుప్పకూలిన మిగ్-21 యుద్ధ విమానం, గుడిసెకి మంటలు.. పైలట్ సురక్షితం

భారత వాయుసేనకు చెందిన మిగ్-21 బైసన్ యుద్ధవిమానం రాజస్థా‌న్‌లోని బర్మార్ వద్ద కుప్పకూలింది. బుధవారం సాయంత్రం టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలింది. ఈ ఘటనలో పైలట్ స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డాడు.

iaf mig bison fighter jet crashes in rajasthan
Author
Barmer, First Published Aug 25, 2021, 9:17 PM IST

భారత వాయుసేనకు చెందిన మిగ్-21 బైసన్ యుద్ధవిమానం రాజస్థా‌న్‌లోని బర్మార్ వద్ద కుప్పకూలింది. బుధవారం సాయంత్రం టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలింది. ఈ ఘటనలో పైలట్ స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డాడు. ఈ సాయంత్రం 5.30 గంటలకు శిక్షణలో భాగంగా విమానం గాల్లోకి లేవగా, టేకాఫ్ అనంతరం సాంకేతికలోపం తలెత్తినట్టు ప్రాథమికంగా వెల్లడైంది. ఈ విమానం ఓ గ్రామ శివారు ప్రాంతంలో కూలిపోవడంతో ఓ గుడిసెకు నిప్పంటుకుంది. ఈ ప్రమాదంపై భారత వాయుసేన శాఖాపరమైన విచారణకు ఆదేశించింది

Follow Us:
Download App:
  • android
  • ios