Asianet News TeluguAsianet News Telugu

ఆరేళ్ల కాపురం తర్వాత భార్య సొంత చెల్లి అని తెలిసింది.. ఖంగుతిన్న భర్తకు నెటిజన్లు ఏమని సూచించారంటే?

ఆరేళ్లు కలిసి జీవించి, వారి దాంపత్య జీవితంలో ఇద్దరికి జన్మనిచ్చిన తర్వాత వారు ఊహించిన వాస్తవం ఒకటి రివీల్ అయింది. తాను పెళ్లి చేసుకున్న మహిళ తన సొంత చెల్లి అని తెలిసింది. దీంతో ఆ భర్త ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. మనోవేదనకు లోనయ్యాడు. ఈ కథనం రెడ్డిట్‌లో పోస్టు చేశారు. అది వైరల్ అయిన తర్వాత దాన్ని డిలీట్ చేశారు.
 

husband revealed his wife actually is biological sister, post went viral, netizens suggests as
Author
First Published Mar 21, 2023, 4:30 PM IST

న్యూఢిల్లీ: ఆ భార్య భర్తలు ఆరేళ్లు కాపురం చేశారు. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. అంతా సవ్యంగా సాగుతున్నదని అనుకుంటున్న సమయంలో భార్యకు కిడ్నీ సమస్య వచ్చింది. ఆమెకు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలని వైద్యులు చెప్పారు. అప్పుడు కిడ్నీ దాతల కోసం ఆలోచిస్తూ కుటుంబ మూలాలు వెతుకుతుండగా ఆ భర్తకు షాకింగ్ విషయం తెలిసింది. తాను ఆరేళ్లుగా కాపురం చేస్తున్న భార్య.. తనకు సొంత చెల్లి అని తెలియవచ్చింది. దీంతో తలపట్టుకున్నాడు. ఈ కథనాన్ని రెడ్డిట్‌లో పోస్టు చేశారు. అది వైరల్ అయింది. అనంతరం, ఆ పోస్టు డిలీట్ చేశారు. 

రెడ్డిట్‌లో పోస్టు చేసిన కథనం ప్రకారం, వారిద్దరూ సిబ్లింగ్స్. కానీ, వారి తల్లిదండ్రులు చేసిన పనితోనే అసలు ట్విస్ట్ ఏర్పడింది. వారి తల్లిదండ్రులు తమ కొడుకును పుట్టినప్పుడే దత్తత ఇచ్చారు. వారు తమ కొడుకును, ఆ కొడుకు తన వాస్తవ తల్లిదండ్రులను మరిచిపోయారు. వీరి కథ ఇంతటితో ముగియలేదు.

ఆరేళ్ల క్రితం ఆ వ్యక్తి ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరూ సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు. వారికి ఇద్దరు సంతానం. ఇటీవలే కుమారుడు పుట్టాడు. ప్రసవం తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించింది. కిడ్నీ సమస్య తలెత్తినట్టు వైద్యులు గుర్తించారు. ఆమెకు కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స చేయాలని సూచించారు. అంతే కాదు, కిడ్నీ దాతల కోసం గాలించాలని చెప్పారు.

దీంతో ఆమెకు కిడ్నీ అందించే దాతల కోసం భర్త గాలించడం మొదలు పెట్టాడు. ఇందులో భాగంగా ఆమెకు కిడ్నీ మ్యాచ్ కావాలి కాబట్టి, కుటుంబ సభ్యుల నుంచే ప్రారంభించాని అనుకున్నాడు. అందుకే ఆమె కుటుంబ సభ్యులతోపాటు, తన కుటుంబ సభ్యుల వివరాలనూ సమీక్షించడం మొదలు పెట్టాడు. 

Also Read: రైల్వే స్టేషన్‌లో పోర్న్ క్లిప్.. ఖంగుతిన్న ప్రయాణికులు.. వీడియోలు వైరల్

భార్య తరఫు కుటుంబ సభ్యుల్లో ఎవరి కిడ్నీ ఆమెతో మ్యాచ్ కాలేదు. చివరకు తన కిడ్నీ మ్యాచ్ అవుతుందేమో చూడాలని వైద్యులను కోరాడు ఆ భర్త. టెస్టుల కోసం శాంపిల్స్ ఇచ్చాడు. అనూహ్యంగా తన భార్యకు తన కిడ్నీ మ్యాచ్ అయినట్టు వైద్యులు చెప్పారు. మరిన్ని టెస్టులు చేయగా.. ఆ కిడ్నీ అసాధారణ రీతిలో మ్యాచ్ అయినట్టు వివరించారు. అదే సందర్భంగా వైద్యులు వారిద్దరూ అన్నా చెల్లి అని గుర్తించి చెప్పారు. 

ఈ విషయం తెలియగానే భర్త షాక్ అయ్యాడు. ఏమి చేయాలో తోచని దుస్థితిలో పడిపోయాడు. కాలాన్ని వెనక్కి తిప్పలేమని, దాంపత్య జీవితాన్ని చెరిపేయలేమని మదనపడ్డాడు. 

ఈ కథనాన్ని రెడ్డిట్‌లో పోస్టు చేయగా.. కొందరు నెటిజన్లు ఇంకో షాక్ ఇచ్చే లా కామెంట్లు చేశారు. ఇంతకు ముందు మీరు సంతోషంగా ఉన్నట్టే ఇక మీదటా ఉండండని సూచించారు. ఆమె కు కిడ్నీ ఇచ్చి కాపాడుకుని పిల్లలతో మంచి లైఫ్ లీడ్ చేయాలని, చరిత్రలోని వారి గతాన్ని అలాగే సమాధి చేయాలని పేర్కొన్నారు. ఇంకొందరు ఆ సత్యాన్ని మనస్సులో ఉంచుకుని కలిసి జీవించడం దుర్భరం అని తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios