Asianet News TeluguAsianet News Telugu

‘‘మీ అమ్మాయి విసిగించింది చంపేశా’’.. అత్తకి ఫోన్ చేసి, అల్లుడు జంప్

మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది.. కట్టుకున్న భార్యను అత్యంత దారుణంగా హత్య చేయడమే కాకుండా.. హత్య వార్తను ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడో కసాయి భర్త. 

husband kills wife
Author
Madhya Pradesh, First Published Nov 10, 2018, 2:14 PM IST

మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది.. కట్టుకున్న భార్యను అత్యంత దారుణంగా హత్య చేయడమే కాకుండా.. హత్య వార్తను ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడో కసాయి భర్త. వివరాల్లోకి వెళితే.. సత్నాకు చెందిన మోనూ అతని భార్య పూజ మధ్య నిన్న రాత్రి వివాదం జరిగింది.

ఈ సమయంలో ఆగ్రహానికి గురైన మోనూ భార్యను గొంతునులిమి అనంతరం రాయితో కొట్టి హతమార్చాడు. అనంతరం భార్య తల్లిదండ్రులకు ఫోన్ చేసి ‘‘ మా ఇంట్లో మీ అమ్మాయి చనిపోయి పడివుంది.. వచ్చి తీసుకెళ్లండి’’ అంటూ చెప్పాడు..

దీంతో ఆందోళనకు గురైన అత్తమామలు కంగారుగా మోను ఇంటికి పరిగెత్తుకొచ్చారు.. ఇంట్లో తమ కుమార్తె రక్తపు మడుగులో పడివుంది.. అయితే అప్పటికీ మోను పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి.. మోనుని వెతికి పట్టుకున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios