Asianet News TeluguAsianet News Telugu

ఫ్రెండ్ భార్యతో అక్రమ సంబంధం.. వారిద్దరినీ హత్య చేసిన భర్త.. ఢిల్లీలో అరెస్టు

ఢిల్లీలో ఫ్రెండ్ భార్యతో ఫ్రెండ్షిప్ పెట్టుకుని, ఆ తర్వాత అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నాడో ప్రబుద్ధుడు. ముందుగా వారిద్దరికీ వార్నింగ్ ఇచ్చిన భర్త చివరకు వారిద్దరినీ కత్తితో పొడిచి చంపేశాడు. అతడిని పోలీసులు అరెస్టు చేశారు.
 

husband kills wife and his friend over affair in delhi, arrested
Author
First Published Jan 1, 2023, 1:33 PM IST

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రెండు హత్యలు చేసిన కేసులో 30 ఏళ్ల వ్యక్తి అరెస్టు అయ్యాడు. తన భార్యను, ఆమెతో అక్రమ సంబంధం నడిపిన ఫ్రెండ్‌ను ఆ వ్యక్తి కత్తితో పొడిచి చంపేశాడు. ఈ జంట హత్యల కేసును పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించినట్టు పోలీసులు శనివారం తెలిపారు.

పోలీసుల వివరాల ప్రకారం.. గంధర్వ్ అలియాస్ సన్ని ఏడాదిన్నర క్రితమే 30 ఏళ్ల మహిళను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత వారు నోయిడాలో కాపురం పెట్టారు. అక్కడే ఓ హాస్పిటల్‌లో పని చేసుకుంటున్నారు. అదే సందర్భంలో ఆయన భార్య సన్నీకి చిన్నప్పటి మిత్రుడైన సాగర్‌తో పరిచయంలోకి వచ్చింది. ఆ తర్వాత ఆమె సాగర్‌తో రిలేషన్‌షిప్ పెట్టుకుంది. ఆ ఫ్రెండ్షిప్ కాస్తా అక్రమ సంబంధంగా మారింది.

ఈ విషయం గంధర్వ్‌కు తెలిసింది. తన భార్యకు వార్నింగ్ ఇచ్చాడు. తన ఫ్రెండ్ సాగర్‌కు కూడా వార్నింగ్ ఇచ్చాడు. తన భార్య నుంచి దూరంగా ఉండాలని రెండు మూడు సార్లు వార్నింగ్ ఇచ్చాడు. కానీ, వారు తమ రిలేషన్‌షిప్ కంటిన్యూ చేశారు.

Also Read: ఎనిమిదేళ్ల చిన్నారి మర్మాంగానికి దారం కట్టి.. సీనియర్ల దాష్టీకం.. ఢిల్లీలో ఘటన..

‘డిసెంబర్ 30వ తేదీన 30 ఏళ్ల మహిళ, ఓ వ్యక్తి దారుణంగా గాయపడ్డారని, అరబిందో మార్గ్ దగ్గరలోని సఫ్దార్‌జంగ్ హాస్పిటల్ రెండో గేట్ సమీపంలో రక్తపు మడుగులో ఇద్దరు కనిపించారని మాకు సమాచారం వచ్చింది. వారిద్దరినీ వెంటనే సఫ్దార్‌జంగ్ హాస్పిటల్‌కు తీసుకెళ్లాం. 30 ఏళ్ల మహిళ ముఖంపై తీవ్ర గాయం ఉన్నది. సాగర్ అనే వ్యక్తికి కూడా తీవ్ర గాయాలు కనిపించాయి’ అని ఢిల్లీ పోలీసు తెలిపారు. వారిద్దరూ చికిత్స పొందుతున్న సమయంలో పరిస్థితులు విషమించి మరణించారని వివరించారు.

సఫ్దార్‌జంగ్ ఎంక్లేవ్ పోలీసు స్టేషన్‌లో ఐపీసీలోని 307, 302 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని అరెస్టు చేయడానికి ఐదు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. 

సఫ్దార్ జంగ్ హాస్పిటల్ చుట్టుపక్కల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి మృతుల కుటుంబాలను విచారించినట్టు పోలీసులు తెలిపారు. 

గత వారం సన్నీ.. తమ కొడుకును బెదిరించినట్టు సాగర్ తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. దీంతో సన్నీని పట్టుకోవడంపై ఫోకస్ పెట్టారు. నోయిడా, గోకుల్‌పురి, కుసుంపూర్ పహారి, కర్కాదూమా, ఇతర పరిసర ప్రాంతాల్లో అతని కోసం గాలించారు. చివరకు సన్నీని అరెస్టు చేశారు. 

తాను ఆ మహిళను పెళ్లి చేసుకున్నానని, తాము ఉంటున్న ప్రాంతం లోనే తన బాల్య మిత్రుడు సాగర్ కూడా నివసిస్తున్నాడని నిందితుడు సన్నీ పోలీసులకు తెలిపాడు. తన భార్యతో సాగర్ గత 15 రోజులుగా ఫ్రెండ్షిప్ చేశాడని, ఆమె తోనే కలిసి ఉన్నాడని వివరించాడు. తన భార్యతో దూరంగా ఉండాలని రెండు మూడు సార్లు సాగర్‌ను బెదిరించానని చెప్పాడు. వారిద్ద రినీ కత్తి తో పొడిచానని, తద్వార వారిద్దరూ మరణించారని అతను అంగీకరించాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Follow Us:
Download App:
  • android
  • ios