Asianet News TeluguAsianet News Telugu

డ్యూటీ నుంచి వచ్చేసరికి శవంగా భార్య.. తట్టుకోలేక..

దీంతో కోపం తెచ్చుకున్న అంకిత ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. డ్యూటీ ముగించుకొని ఇంటికొచ్చిన నిఖిల్.. గదిలో ఫ్యానుకు వేలాడుతున్న భార్య మృతదేహాన్ని చూసి చలించిపోయాడు. 

Husband Commits suicide after wife death in Pune
Author
hyderabad, First Published Jul 3, 2021, 8:31 AM IST

డ్యూటీ నుంచి ఇంటికి వచ్చేసరికి భార్య శవమై కనిపించింది. భార్య నవ్వుతూ ఎదురొస్తుంది అనుకుంటే.. శవమై ఫ్యానుకు వేలాడుతూ కనిపించే సరికి తట్టుకోలేకపోయాడు. వెంటనే తాను కూడా మరో గదిలోకి వెళ్లి సూసైడ్ చేసుకున్నాడు. ఈ దారుణ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పూణేకి చెందిన నిఖిల్, అంకిత దంపతులకు కొద్ది నెలల క్రితమే వివాహమైంది. వీరిద్దరూ డాక్టర్లు కాగా..  హాస్పిటల్ లో పనిచేస్తునన్ారు. గురువారం భర్త ఆస్పత్రిలో ఉండగా అంకిత ఫోన్ చేసింది. ఫోన్లో వీళ్లిద్దరి మధ్య ఏదో గొడవ జరిగింది. ఈ క్రమంలో నిఖిల్ సడెన్‌గా ఫోన్ కట్ చేసేశాడు. దీంతో కోపం తెచ్చుకున్న అంకిత ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. డ్యూటీ ముగించుకొని ఇంటికొచ్చిన నిఖిల్.. గదిలో ఫ్యానుకు వేలాడుతున్న భార్య మృతదేహాన్ని చూసి చలించిపోయాడు. 

బాధ తట్టుకోలేక పక్క గదిలోకి వెళ్లి తను కూడా ఉరిపోసుకున్నాడు. అంతకుముందు రోజు రాత్రి భార్యాభర్తల ఫోన్ రికార్డింగులు ఈ విషయాన్నే ధ్రువీకరిస్తున్నాయని పోలీసులు అంటున్నారు. ఉదయాన్నే ఇంటికొచ్చిన పనిమనిషి.. యజమానులు ఎంతసేపటికీ తలుపులు తెరవకపోవడంతో ఇరుగుపొరుగు ఇళ్ల వాళ్ల సాయం అడిగింది. వారిలో ఎవరో పోలీసులకు సమాచారం అందించారు. అరగంట తర్వాత ఆ ఇంటికి చేరుకున్న పోలీసులు.. తలుపులు బద్దలు కొట్టగా భార్యాభర్తల మృతదేహాలు కనిపించాయి. వీటిని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం తర్వాత ఈ మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగిస్తామని పోలీసులు పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios