గుజరాత్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఫర్నీచర్ గోడౌన్ లో మంటలు ఎగిసిపడుతుండడంతో ఫర్నీచర్ మొత్తం క్షణాల్లో దగ్థం అయ్యింది. 

గుజరాత్ : గుజరాత్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాజ్ కోట్ లోని ఓ ఫర్నీచర్ గోడౌన్ లో అగ్ని ప్రమాదం జరిగింది. క్షణాల వ్యవధిలో మంటలు వ్యాపించడంతో ఫర్నీచర్ మొత్తం దగ్థం అయ్యింది. గోడౌన్ ముందు ఉన్న వాహనాలు కూడా దగ్ధం అయ్యాయి. సమాచారం అందడంతో ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మంటలు చుట్టుపక్కల ఉన్న ఇల్లు, దుకాణాలకు వ్యాపిస్తున్నాయి.. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred