రోడ్డు పక్కన రూ. కోటి.. ఇప్పటికి రూ. 264 కోట్లు స్వాధీనం.. !
ఎన్నికలు అంటేనే డబ్బులు వెదజల్లడంలా మారిపోయింది. ఎంత ఎక్కువ డబ్బులు ఖర్చు పెడితే అన్ని ఓట్లు రాలతాయని అన్ని పార్టీలూ నమ్ముతున్నాయి. అందుకే ఎన్నికల వేళ ఎక్కడెక్కడో దాచిపెట్టిన డబ్బంతా బైటికి వస్తుంది. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకే ఎన్నికల కమిషన్ అభ్యర్థుల కదలికల మీద నిఘా పెడుతుంది. అక్రమ డబ్బు రవాణాను అడ్డుకుంటుంది.
ఎన్నికలు అంటేనే డబ్బులు వెదజల్లడంలా మారిపోయింది. ఎంత ఎక్కువ డబ్బులు ఖర్చు పెడితే అన్ని ఓట్లు రాలతాయని అన్ని పార్టీలూ నమ్ముతున్నాయి. అందుకే ఎన్నికల వేళ ఎక్కడెక్కడో దాచిపెట్టిన డబ్బంతా బైటికి వస్తుంది. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకే ఎన్నికల కమిషన్ అభ్యర్థుల కదలికల మీద నిఘా పెడుతుంది. అక్రమ డబ్బు రవాణాను అడ్డుకుంటుంది.
ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా డబ్బు వర్షం కురుస్తోంది. ఈ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బుదవారం వరకు వివిధ ప్రాంతాల్లో రూ. 264 కోట్ల నగదు పట్టుబడింది.
మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్హాసన్కు సన్నిహితుడు, తిరుచ్చిరాపల్లి తూర్పు నియోజకవర్గం అభ్యర్థి లేరోన్ మొరాయ్సి (45), ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు.
ఈ నెల 22, 23 తేదీల్లో జరిపిన తనికీల్లో రూ. 10కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కమల్ పార్టీ ప్రముఖుల నుంచి రూ. 22.5 కోట్లు స్వాధీనం చేసుకుని, రూ. 80 కోట్ల పన్ను ెగవేతకు పాల్పడిన విషయాన్ని ఇటీవల ైటీ అధికారులు గుర్తించినట్లు సమాచారం.
తన పేరు చెప్పడానికి ఇష్టపడని ఐటీ అధికారి మీడియాతో మాట్లాడుతూ.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే లేరోన్ మోరాయ్స్ భారీ ఎత్తున పన్ను ఎగవేసినట్లు సమాచారం అందిందని, ఈ మేరకు ఐటీ దాడుల చేపట్టామని తెలిపారు.
ఎంఎన్ఎం కోశాధికారి చంద్రశేఖర్ ఇళ్లు, పరిశ్రమలపై ఈ నెల 17,18 తేదీల్లో దాడులు నిర్వహించి రూ. 11.50 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. రూ. 80 కోట్ల పన్ను ఎగవేతను గుర్తించారు. ఇదిలా ఉండగా చెన్నై పల్లవరం వద్ద వాహనాల తనిఖీలు చేసున్న ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులకు ఒక కారులో తరలిస్తున్న రూ.4 కోట్ల విలువైన బంగారు, వెండి నగలు పట్టుబడ్డాయి. అలాగే ఈ రోడ్ లో జరిపిన తనిఖీల్లో రూ. 4.5 కిలోల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు.
తిరుచ్చిరాపల్లి జిల్లాలో రోడ్డు పక్కన పడున్న రూ. కోటి కరెన్సీ కలకలం రేపింది. తిరుచ్చిరాపల్లి–కరూర్ జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి రెండు కార్లు, వాటికి సమీపంలో కొందరు వ్యక్తులు వాదులాటలో ఉండగా ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు వచ్చారు.
అధికారులను చూడగానే ఒక కారులోని వ్యక్తులు పారిపోగా రెండో కారును, నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఇంతలో కారుకు సమీపంలో రోడ్డు పక్కన పడి ఉన్న బియ్యం బస్తాలను పరిశీలించగా రూ.500 నోట్లతో రూ. కోటి విలువైన కరెన్సీని గుర్తించారు.
అన్నాడీఎంకే పతాకంతో కూడిన కానును స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున నగదు, నగలు పట్టుబడడంతో ఎన్నికల కమిషన్ 936 ఫ్లయింగ్ స్క్వాడ్ లతో 24 గంటల నిఘాను తీవ్రం చేసింది.
ఎన్నికల సమయంలో ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలతో బంగారు నగల వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలతపై సానుకూలంగా స్పందించాలని కోరుతూ చెన్నై జ్యువెలర్స్ అసోసియేషన్ బుధవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సత్యబ్రత సాహూను కలిసి వినతిపత్రం సమర్పించింది.