పాకిస్థాన్ లో భారత్ క్షిపణి పొరపాటున పేలడంపై రాజ్యసభలో కంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళవారం నాడు ప్రకటన చేశారు.
న్యూఢిల్లీ: ఈ నెల 9వ తేదీన ప్రమాదవశాత్తు Pakistan భూభాగంలో భారత్ Missile పేలుడు అంశంపై అత్యున్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్టుగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు.
మంగళవారం నాడు రాజ్యసభలో ఈ విషయమై Rajnath Singh ప్రకటన చేశారరు. భారత క్షిపణి వ్యవస్థ అత్యంత సురక్షితమైందన్నారు.ఈ నెల 9వ తేదీన క్షిపణి యూనిట్ సాధారణ నిర్వహణ తనిఖీలు చేస్తున్న సమయంలో సాయంత్రం ఏడు గంటల సమయంలో అనుకోకుండా ఓ క్షిపణి విడుదలైందని మంత్రి చెప్పారు. ఈ విషయాన్ని ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుందన్నారు. క్షిపణి ఎలా ప్రయోగించబడిందనే విషయమై విచారణకు ఆదేశించామని మంత్రి తెలిపారు. ఈ క్షిపణి పాక్ భూభాగంలో పడిందన్నారు. ఈ ఘటన దురదృష్టకరమైందిగా మంత్రి చెప్పారు. ఈ క్షిపణి ప్రయోగంతో ఎలాంటి నష్టం జరగలేదని మంత్రి వివరించారు.
తమ కార్యకలాపాలు, నిర్వహణ, తనిఖీలు మూల్యాంకనం చేయబడే ప్రామాణిక ఆపరేటింగ్ విధాల పరిమితిని అనుసరించి నిర్వహిస్తామన్నారు. ఆయుధ వ్యవస్థల భద్రత, భద్రతలో ఏమైనా అలసత్వం ఉంటే వాటిని పరిష్కరిస్తామన్నారు. ఈ తరహా వ్యవస్థలను నిర్వహించడంలో తమ సాయుధ బలగాలకు మంచి అనుభవం ఉందని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు.
