Asianet News TeluguAsianet News Telugu

బాబా రాందేవ్‌కు ఊరట: పతంజలి కరోనా ఔషదం ‘‘ కరోనిల్‌’’ కు హార్యానా ఆమోదం

ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ ఆధ్వర్యంలో నడుస్తున్న పతంజలి సంస్థ కరోనా కోసం 'కరోనిల్' అనే ఔషధాన్ని తయారు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ మందు విశ్వసనీయతపై పలు అనుమానాలున్నాయి. దీనిపై వివాదం కూడా కొనసాగుతోంది.

haryana to give 1 lakh kits of ramdevs coronil ksp
Author
New Delhi, First Published May 25, 2021, 2:32 PM IST

ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ ఆధ్వర్యంలో నడుస్తున్న పతంజలి సంస్థ కరోనా కోసం 'కరోనిల్' అనే ఔషధాన్ని తయారు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ మందు విశ్వసనీయతపై పలు అనుమానాలున్నాయి. దీనిపై వివాదం కూడా కొనసాగుతోంది.

మరోవైపు, కరోనిల్ ను కోవిడ్ పేషెంట్లకు పంపిణీ చేయాలని హర్యానా ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా బారిన పడిన వారికి ఉచితంగా ఈ కరోనిల్ కిట్ ను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని హర్యానా మంత్రి అనిల్ విజ్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.

Also Read:మాది పనికిమాలిన వైద్యమా.. బాబా రాందేవ్‌పై డాక్టర్ల సంఘం ఆగ్రహం

హర్యానాలోని కోవిడ్ పేషెంట్లకు ఒక లక్ష పతంజలి కరోనిల్ కిట్లను పంపిణీ చేస్తామని అనిల్ విజ్ పేర్కొన్నారు. ఈ కిట్లకు అయ్యే ఖర్చును పతంజలి సగం భరిస్తుందని... మిగిలిన సగం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని మంత్రి చెప్పారు.

మరోవైపు, కరోనిల్ పై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఈ ఔషధాన్ని అశాస్త్రీయంగా కొట్టిపారేసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో తమ మెడిసిన్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్టిఫికెట్ కూడా ఉందని రాందేవ్ వాదించారు. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో పతంజలి మెడిసిన్ కు హర్యానా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది

Follow Us:
Download App:
  • android
  • ios