Asianet News TeluguAsianet News Telugu

గర్భిణిపై సామూహిక అత్యాచారం, గర్భస్రావం.. మహిళ పరిస్థితి విషమం...

ఉత్తరప్రదేశ్ లో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఓ గర్భిణీ మీద ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆమెకు గర్భస్రావం అయ్యింది. 

Gang rape of pregnant woman, abortion in Uttarpradesh
Author
First Published Sep 22, 2022, 6:45 AM IST

ఉత్తర ప్రదేశ్ : గర్భిణీపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేయగా.. బాధితురాలికి గర్భస్రావం అయిన అమానుష ఘటన ఉత్తర ప్రదేశ్లోని బరేలిలో జరిగింది. బాధితురాలి భర్త ఫిర్యాదు ప్రకారం.. మూడు నెలల గర్భంతో ఉన్న మహిళ ఈ నెల 13న పొలంలో పని చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు ఫలితంగా ఆమెకు గర్భస్రావం అయింది. బాధితురాలి ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన జరిగిన రోజే ఫిర్యాదు చేసినా.. పోలీసులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. 

తన భార్య ఆరోగ్యం విషమించాక జిల్లా ఆస్పత్రిలో చేర్చి.. అక్కడినుంచి పోస్టు ద్వారా ఫిర్యాదు పంపితే.. మంగళవారం కేసు నమోదు చేశారని తెలిపాడు. అయితే ఈ నెల 16నే మహిళా పోలీస్ స్టేషన్లో అతడు ఫిర్యాదు చేశాడని పోలీసులు అంటున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఒకరిని అరెస్టు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు. 

వివాహేతర సంబంధం: హోటల్‌ రూమ్‌లో లవర్‌తో అడ్డంగా బుక్కైన భర్త.. చెప్పుతో బుద్ధి చెప్పిన భార్య (వీడియో)

ఇదిలా ఉండగా, సెప్టెంబర్ 20నన జార్ఖండ్ లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ బాలికపై యువకుడు దాష్టీకానికి పడ్డాడు. ఆమె తనను ప్రేమిస్తోందని స్నేహితుల ముందు రుజువు చేసుకునేందుకు బాలిక మీద అత్యాచారానికి తెగబడ్డాడు.  వివరాల్లోకి వెళితే…  కోయలంచల్ ధన్ బాద్ ప్రాంతానికి చెందిన కొందరు యువకుల మధ్య ఓ బాలిక విషయంలో ఇటీవల గొడవ జరిగింది. ఆమె తనను ప్రేమిస్తుందని యువకుల్లో ఒకరు చెప్పారు. దీంతో తననే ప్రేమిస్తోందని సంజయ్ అనే మరో వ్యక్తి వాదించాడు. 

అంతేకాదు, తానే ఆమె ప్రేమికుడినని నిరూపించుకుంటానని.. వారి ముందు సవాలు చేశాడు. మరుసటిరోజు బాలికకు మాయమాటలు చెప్పి పొదల్లోకి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. ఆధారాలు వీడియో తీసి స్నేహితులకు పంపించాడు. వారు ఆ వీడియోను బంధువులకు చూపించడంతో జరిగిన ఘోరం వెలుగు లోకి వచ్చింది.  బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంజయ్ ను అరెస్టు చేశారు.

కాగా, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని పాతబస్తీలో దారుణమైన సంఘటన జరిగింది. మైనర్ బాలికను కిడ్పాప్ చేసిన యువకులు ఓ లాడ్జీలో సామూహిక అత్యాచారం చేశారు. ఈ సంఘటనపై బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితులు బాలికను లాడ్జీకి తీసుకుని వెళ్లి మత్తుమందు ఇచ్చారు. 

ఆ తర్వాత రెండు రోజుల పాటు ఆమెపై సామూహిక అత్యాచారం జరిపారు. ఆ తర్వాత ఆమెను లాడ్జీలోనే వదిలేసి వెళ్లిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో యువకుడు పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios