Asianet News TeluguAsianet News Telugu

విషాదం.. ఫతేపూర్ సిక్రీలో 9 అడుగుల ఎత్తైన ప్లాట్‌ఫారమ్‌పై నుంచి పడి ఫ్రెంచ్ టూరిస్ట్ మృతి..

ఫ్రెంచ్ పర్యాటకులు ఫోటోలు తీసుకుంటుండగా బరువు ఎక్కువై చెక్క రెయిలింగ్ కూలిపోయింది. దీంతో 9 అడుగుల ఎత్తునుంచి పడి ఓ మహిళా టూరిస్ట్ మృతి చెందింది. 

French tourist died after falling from 9 feet high platform in Fatehpur Sikri uttarpradesh - bsb
Author
First Published Sep 22, 2023, 12:17 PM IST

ఉత్తర్ ప్రదేశ్ : ఉత్తర్ ప్రదేశ్ లోని ఫతేపూర్ సిక్రీ కోటలో విషాదఘటన చోటు చేసుకుంది. ఫతేపూర్ సిక్రీ కోట చుట్టూ ఉన్న చెక్క రెయిలింగ్ విరిగిపోవడంతో తొమ్మిది అడుగుల ఎత్తున్న ప్లాట్‌ఫారమ్‌పై నుంచి పడి ఒక ఫ్రెంచ్ పర్యాటకురాలు గురువారం మరణించింది. ఫోర్ట్‌లోని టర్కిష్ సుల్తానా ప్యాలెస్‌లో ఫోటోలు తీస్తున్న ఫ్రెంచ్ టూరిస్టుల బృందంలో మరణించిన మహిళ కూడా ఉంది. టూరిస్టుల బరువు కారణంగా చెక్క రెయిలింగ్ విరిగిపోయిందని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారి తెలిపారు.

ప్లాట్‌ఫారమ్ నుండి రాతి నేలపై పడటం వల్ల ఆమె తలకు గాయాలు అయ్యాయి. తరువాత, ఆమెను ఎస్ఎన్ మెడికల్ కాలేజీకి తీసుకువెళ్లారు, ఆపై ఆగ్రాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు, అక్కడ ఆమె చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. సర్వే ఆఫ్ ఇండియా అధికారి, రాజ్ కుమార్ పటేల్ మాట్లాడుతూ, మహిళ పడిపోయిన తర్వాత అపస్మారక స్థితికి చేరుకుంది.

దేశంలో ప్ర‌జాస్వామ్యం దాడికి గుర‌వుతోంది.. : మోడీ టార్గెట్ గా రాహుల్ గాంధీ విమ‌ర్శ‌లు

రక్తస్రావం కాకపోవడంతో తలకు గాయమైందని వారు అనుమానిస్తున్నారు. సిబ్బంది అంబులెన్స్‌కు ఫోన్ చేశారు, కానీ రావడానికి కొంత సమయం పట్టింది. అప్పటికి, స్మారక చిహ్నం వద్ద ఉన్న కొంతమంది గైడ్‌లు అక్కడ అంబులెన్స్‌ను ఏర్పాటు చేసి, గాయపడిన పర్యాటకుడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు.

కోవిడ్ -19 మహమ్మారి తర్వాత ఈ రైలింగ్ ఏర్పాటు చేశారు. గత కొద్ది నెలలుగా అది లూజ్ గా ఉందని, ఊగుతుందని స్థానిక టూర్ గైడ్ చెబుతున్నాడు.  గురువారం ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఫతేపూర్ సిక్రీలో అంబులెన్స్‌లు లేవని, గాయపడిన పర్యాటకురాలిని అక్కడినుంచి తరలించడానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కిరావోలీ నుండి పిలిపించాల్సి వచ్చిందని అతను పేర్కొన్నాడు.
 

Follow Us:
Download App:
  • android
  • ios