న్యూఢిల్లీలో  బుధవారంనాడు తెల్లవారుజామున జరిగిన  కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. మరోకరు గాయపడ్డారు.

న్యూఢిల్లీ: న్యూఢిల్లీలో బుధవారంనాడు జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.న్యూఢిల్లీలోని భజన్‌పుర ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాల్పుల్లో మృతి చెందిన వ్యక్తిని హర్‌ప్రీత్ గిల్ గా గుర్తించారు. దుండగులు కాల్పులకు దిగిన వెంటనే స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో వైద్యులు పరీక్షించి అతను మృతి చెందినట్టుగా ప్రకటించారు.

ఈ ఘటనలో గాయపడిన వ్యక్తిని గోవింద్ సింగ్ గా గుర్తించారు. అతడికి లోక్‌నాయక్ జయప్రకాష్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.మోటార్ బైక్ పై ఈ ఇద్దరు వెళ్తున్న సమయంలో దుండగుడు అడ్డగించి కాల్పులు జరిపినట్టుగా పోలీసులు చెబుతున్నారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.