ఛండీఘడ్-కోచ్ వల్లి రైలులో అగ్ని ప్రమాదం
న్యూఢిల్లీలోని రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్న రైలులో అగ్ని ప్రమాదం సంబవించింది.ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లింది.
న్యూఢిల్లీ:న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో ఛండీఘడ్-కోచ్ వల్లి రైలులో శుక్రవారం నాడు అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. రైల్వేస్టేషన్ లో రైలు నిలిచి ఉన్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది. ఈ సమయంలో రైలులో ఉన్న ప్రయాణీకులను అధికారులు కిందకు దించేశారు.
ఛంఢీఘడ్ కోచ్వల్లి ఎక్స్ప్రెస్ రైలు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లోని 8వ ఫ్లాట్ఫారంలో నిలిచి ఉన్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. రైలుకు విద్యుత్ ను సరఫరా చేసే బోగి నుండి ఆకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి.
ఈ బోగీ నుండి ఇతర బోగీలకు కూడ మంటలు వ్యాపించాయి. ఈ విషయాన్ని గుర్తించిన రైల్వే అధికారులు వెంటనే ఫైరింజన్లను రప్పించి మంటలను ఆర్పతున్నారు.ఈ అగ్ని ప్రమాదం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ రైళ్ల రాకపోకలకు మాత్రం తీవ్ర అంతరాయం ఏర్పడింది.