దేశ రాజధాని ఢిల్లీలోని పంజాబీ బాగ్ ప్రాంతంలో ఉన్న ఈఎస్‌ఐ ఆసుపత్రిలో గురువారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. హాస్పిటల్‌లోని మూడో అంతస్తులో మంటలు చెలరేగాయి. 

దేశ రాజధాని ఢిల్లీలోని పంజాబీ బాగ్ ప్రాంతంలో ఉన్న ఈఎస్‌ఐ ఆసుపత్రిలో గురువారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. హాస్పిటల్‌లోని మూడో అంతస్తులో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఏడు ఫైరింజగన్లను రంగంలోకి దింపి మంటలను అదుపు చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను రెస్క్యూ టీమ్ అక్కడి నుంచి సురక్షితంగా తరలించింది. మూడో అంతస్తులోని ఓటీ రూమ్ నుంచి మంటలు జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉన్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.