Asianet News TeluguAsianet News Telugu

ఈఎస్ఐ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 7 ఫైరింజన్లతో రెస్క్యూ ఆపరేషన్

దేశ రాజధాని ఢిల్లీలోని పంజాబీ బాగ్ ప్రాంతంలో ఉన్న ఈఎస్‌ఐ ఆసుపత్రిలో గురువారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. హాస్పిటల్‌లోని మూడో అంతస్తులో మంటలు చెలరేగాయి. 

fire breaks out at esi hospital in punjabi bagh new delhi ksp
Author
New Delhi, First Published May 20, 2021, 4:20 PM IST

దేశ రాజధాని ఢిల్లీలోని పంజాబీ బాగ్ ప్రాంతంలో ఉన్న ఈఎస్‌ఐ ఆసుపత్రిలో గురువారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. హాస్పిటల్‌లోని మూడో అంతస్తులో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఏడు ఫైరింజగన్లను రంగంలోకి దింపి మంటలను అదుపు చేశారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను రెస్క్యూ టీమ్ అక్కడి నుంచి సురక్షితంగా తరలించింది. మూడో అంతస్తులోని ఓటీ రూమ్ నుంచి మంటలు జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉన్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios