Asianet News TeluguAsianet News Telugu

అవివాహితపై ఐదేళ్లుగా నకిలీ బాబా అత్యాచారం... వీడియో తీసి బ్లాక్ మెయిల్..

వివాహం కావడం లేదని పరిషారం కోసం బాబా దగ్గరికి వెడితే.. మత్తు పానీయం ఇచ్చి అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ తరువాత ఐదేళ్లుగా బ్లాక్ మెయిల్ చేస్తూ.. పదే పదే అత్యాచారానికి పాల్పడుతున్నాడు. 

Fake baba molestation unmarried woman for five years in karnataka
Author
Hyderabad, First Published Aug 24, 2022, 11:00 AM IST

బెంగళూరు : తనకు మత్తు వచ్చేలా పానీయాన్ని తాగించి ఆనందమూర్తి అనే నకిలీ స్వామి ఐదేళ్లు అత్యాచారానికి పాల్పడుతున్నాడు అని బాధిత మహిళ ఒకరు ఆరోపించారు. తనకు వివాహం కాకుండా అడ్డుకుంటూ,  బెదిరింపులకు పాల్పడుతున్నాడని మంగళవారం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె వాపోయింది, తనకు పెళ్లి కాకపోవడంతో పరిహార మార్గం కోసం కుటుంబ సభ్యులు సూచనలతో ఐదేళ్ల కిందట ఆనందమూర్తిని కలిశానని బాధితురాలు వివరించింది. పూజ చేస్తున్న సమయంలో  ఒక పానీయం  తాగమని ఇచ్చాడని..  అది తాగిన తర్వాత తాను సృహ తప్పి పడిపోయానని..  ఆ తర్వాత తనపై అత్యాచారానికి ఆ స్వామి పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేసింది. 

అయితే, ఆ సమయంలో అతని భార్య లత తన ఫోన్ లో అత్యాచార దృశ్యాన్ని మొత్తం రికార్డు చేసిందని ఆందోళన వ్యక్తం చేసింది. ఆ వీడియోని అడ్డుపెట్టుకుని అప్పటినుంచి తనపై వరుసగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు అని ఆరోపించింది. అంతేకాదు, మూడేళ్ల నుంచి తనకు వస్తున్న పెళ్లి సంబంధాలను ఆ ఇద్దరూ కలిసి చెడగొడుతున్నారు అని తన న్యాయవాది జ్ఞానేశ్ సహాయంతో ఆమె ఫిర్యాదు చేసింది. గత వారం వచ్చిన సంబంధాన్నీ వారు చెడగొట్టారని బాధితురాలు  ఆక్రోశించింది. నా కుటుంబ సభ్యుల నుంచి ఇప్పటికే లక్షల రూపాయల నగదు తీసుకున్నారని.. పోలీసులకు చెబితే వీడియోలు చిత్రాలను ఇంటర్నెట్ లో పెడతామని వేధిస్తున్నారని ఫిర్యాదు చేసింది. దీని ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

హైద్రాబాద్ లో ఏడుగురు నకిలీ బాబాల అరెస్ట్: రూ. 8 లక్షలు స్వాధీనం

ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే మే నెలలో మహారాష్ట్రలో వెలుగు చూసింది. ఓ మహిళ కొన్ని రోజులుగా తీవ్ర ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటుంది. కొడుకు ఆరోగ్యం కూడా బాగోలేదు. దీంతో ఆమె తన భర్త, సోదరుడితో కలిసి ఓ బాబాను ఆశ్రయించింది. మహిళ బలహీనతను ఆసరాగా చేసుకున్న దొంగ బాబా దారుణానికి పాల్పడ్డాడు. ఆ మహిళను భయపెట్టి ఆమె మీద అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ దొంగ బాబాను అరెస్ట్ చేశారు.

మహారాష్ట్రలోని పూణేకు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన 35 ఏళ్ల మహిళ కుటుంబం కొన్ని రోజులుగా తీవ్ర ఆర్థిక సమస్యలతో అల్లాడుతుంది. ఆ మహిళ కొడుకు ఆరోగ్యం కూడా బాగోలేదు. దీంతో ఇరుగుపొరుగు వారి సలహా మేరకు ఆమె తన భర్త, సోదరుడితో కలిసి ఒక అరవై ఏళ్ల బాబా దగ్గరికి వెళ్ళింది. అతనితో తమ సమస్యలు చెప్పుకుంది. సమస్యలు తీరాలంటే ప్రత్యేక పూజలు చేయాల్సి ఉంటుందని ఆ బాబా అన్నాడు.  ఆ మహిళ దానికి అంగీకరించింది.

ఆ మహిళ భర్త, సోదరుడిని బయటనుంచి బాబా ఆమెను ఓ గదిలోకి తీసుకు వెళ్ళాడు. ఆమెను నగ్నంగా మారాల్సిందిగా ఆదేశించాడు. అందుకు ఆమె నిరాకరించింది. తాను చెప్పినట్లు వినకపోతే కుటుంబ సభ్యులు మొత్తం చనిపోతారని బెదిరించాడు. దీంతో ఆ మహిళ భయపడి బాబా చెప్పినట్లే చేసింది. ఆ తర్వాత ఆమెపై బాబా అత్యాచారానికి పాల్పడ్డాడు. బయటకు వచ్చిన మహిళ తన సోదరుడికి మొత్తం విషయం చెప్పింది. అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అరెస్టు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios