Kuldeep Bishnoi: హర్యానా కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయ్ రాజీనామా చేసిన మరుసటి రోజే (గురువారం) బీజేపీలో చేరారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఇతర కాషాయ పార్టీ నాయకుల సమక్షంలో బిష్ణోయ్, అతని భార్య రేణుకా బిష్ణోయ్ బిజెపిలో చేరారు. అయితే.. బీజేపీలో ఆయన రాజకీయ భవిష్యతు ఎలా సాగుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది.
Kuldeep Bishnoi: హర్యానాలో కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయ్ రాజీనామా చేసిన మరుసటి రోజే (గురువారం) బీజేపీలో చేరారు. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఇతర కాషాయ పార్టీ నాయకుల సమక్షంలో బిష్ణోయ్, అతని భార్య రేణుకా బిష్ణోయ్ బిజెపిలో చేరారు.
దేశం,పేదల సంక్షేమం గురించి ఎప్పుడూ ఆలోచించే ఉత్తమ భారత ప్రధాని నరేంద్ర మోదీ అని కుల్దీప్ బిష్ణోయ్ కొనియాడారు. అలాగే.. ఎనిమిదేళ్లకు పైగా ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న ఖట్టర్.. రాష్ట్ర అభివృద్దికి కృష్టి చేస్తున్నారని ప్రశంసించారు. ఢిల్లీలో పార్టీలో చేరిన అనంతరం ఆయన బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. పలు అంశాలపై చర్చించినట్టు తెలుస్తుంది.
హర్యానాలోని అడంపూర్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు. ఆయన నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎంపిగా ఎన్నికయ్యారు. రాజ్యసభ ఉపఎన్నికల్లో బిష్ణోయ్ క్రాస్ ఓటింగ్ చేయడంతో ఆయనను పార్టీలోని అన్ని పదవుల నుంచి కాంగ్రెస్ తొలగించింది.
కుల్దీప్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మరుసటి రోజే.. బీజేపీలో చేరారు. మరీ బీజేపీలో చేరిన కుల్దీప్ బీజేపీలో సత్తా చాటుతాడా? లేదా? అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. సోనాలి ఫోగట్ నుండి ఎంపి బ్రిజేంద్ర సింగ్ వరకు బిజెపిలో తన రాజకీయ మార్గంలో సవాలుగా మారవచ్చు.
హర్యానా రాజకీయాల్లో జాట్యేతర ముఖంగా పరిగణించబడుతున్న కుల్దీప్ బిష్ణోయ్ నేడు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో బిశ్వోయ్ సభ్యత్వం తీసుకున్నారు. సభ్యత్వం తీసుకునే ముందు ఆయన మద్దతుదారులు ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం వెలుపల గుమిగూడారు.
ఒకరోజు ముందుగా..(ఆగస్టు 3న) కాంగ్రెస్ ఎమ్మెల్యే పదవికి బిశ్వోయ్ రాజీనామా చేశారు. ఆరేళ్ల తర్వాత కాంగ్రెస్కు గుడ్బై చెప్పి కొత్త రాజకీయ యాత్రను ప్రారంభించబోతున్నట్లు కుల్దీప్ మంగళవారం ఆదంపూర్లో తన మద్దతుదారులతో చెప్పారు. బిజెపిలో చేరిన కుల్దీప్ బిష్ణోయ్ కు రాజకీయ మార్గం అంత సులభం కాదు. బీజేపీలో స్థిరపడేందుకు ఆయన పెద్ద పోరాటమే చేయాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
హర్యానాలో రాజ్యసభ ఎన్నికల సందర్భంగా 'క్రాస్ ఓటింగ్' కారణంగా కుల్దీప్ బిష్ణోయ్ను కాంగ్రెస్ పార్టీ అన్ని పదవుల నుండి తొలగించింది. అప్పటి నుంచి కుల్దీప్ బిష్ణోయ్ బీజేపీ నేతలతో వరుస బహిరంగ సభలు ప్రారంభించారు. సీఎం మనోహర్ లాల్ ఖట్టర్తో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పలు దఫాలుగా సమావేశాలు జరిపినా.. అనంతరం ఆదంపూర్లో జరిగిన భారీ బహిరంగ సభలో కాంగ్రెస్ను వీడుతున్నట్లు ప్రకటించారు.
హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ తనయుడు అయిన కులదీప్ బిష్ణోయ్ బీజేపీలో చేరడం ఆ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించడం ఖాయం. హర్యానా రాజకీయాల్లో జాట్యేతర ముఖాలను పరిగణిస్తారు. బిజెపిలో చేరిన తర్వాత కూడా కుల్దీప్ బిష్ణోయ్కు రాజకీయ మార్గం అంత సులభం కాదు, ఎందుకంటే పార్టీలో తన స్థానాన్ని సంపాదించుకోవడానికి అతను తీవ్రంగా కృషి చేయాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కుల్దీప్ బిష్ణోయ్ ముందు రాజకీయ సవాళ్లేంటినో ఎదుర్కొవాల్సి వస్తుంది.
కుల్దీప్ బిష్ణోయ్ బీజేపీలో చేరడం పట్ల బీజేపీ నాయకురాలు సోనాలి ఫోగట్ సంతోషంగా లేరని టాక్. 2019 అసెంబ్లీ ఎన్నికల్లోనే ఫోగట్ కుల్దీప్ బిష్ణోయ్ పై పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చారు. అటువంటి పరిస్థితిలో.. ఆయన మొదట సోనాలి ఫోగట్ను ఎదుర్కోవలసి ఉంటుంది. ఆమె బీజేపీలోకి రావడాన్ని స్వాగతించినప్పటికీ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆదంపూర్ స్థానం నుంచి పోటీ చేస్తానని ఆమె ఇప్పటికే ప్రకటించారు. అటువంటి పరిస్థితిలో.. కుల్దీప్ పార్టీలో చేరడం స్థానిక బిజెపి నాయకుల నుండి వ్యతిరేకత మరియు ఆగ్రహాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది.