ఓ దుకాణంలో ఉన్న కుర్చీలకు ఓ స్టిక్కర్ కూడా అంటించారు. దాని ప్రకారం.. ఆ కుర్చీలో ఉద్యోగులు కూర్చోవడానికి వీలు లేదు అని రాసి ఉండటం గమనార్హం. దీనిని ఓ వ్యక్తి ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది కాస్త వైరల్ గా మారింది.
ఓ కంపెనీలో ఉద్యోగులు ఏం చేయాలి? ఏం చేయకూడదు అనే విషయంలో బాస్ దే తుది నిర్ణయం కావచ్చు. వారు తమ ఉత్పాదకతను పెంచుకోవడానికి కంపెనీలో ఎలాంటి రూల్స్ అయినా పెట్టే అవకాశం ఉంటుంది. కానీ పనిగంటలు పూర్తయ్యే వరకు కనీసం కూర్చోవడానికి కూడా వీలు లేకుండా రూల్ పెట్టడం మాత్రం మంచిది కాదు. మరీ అంత దారుణంగా ఏ యజమాని ప్రవర్తించడు అనుకుంటే మీరు పొరపాటు పడినట్లే. తాజాగా ఓ సంస్థ అలాంటి రూల్ పెట్టింది. ఓ దుకాణంలో ఉన్న కుర్చీలకు ఓ స్టిక్కర్ కూడా అంటించారు. దాని ప్రకారం.. ఆ కుర్చీలో ఉద్యోగులు కూర్చోవడానికి వీలు లేదు అని రాసి ఉండటం గమనార్హం. దీనిని ఓ వ్యక్తి ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది కాస్త వైరల్ గా మారింది.
ఒక యజమాని పని వద్ద "ఉత్పాదకతను పెంచడానికి" దుకాణం నుండి కుర్చీలను తీసివేయమని ఆదేశించాడు. కస్టమర్ల కుర్చీలు అలాగే ఉన్నాయి కానీ ఉద్యోగులు ఉపయోగించే కుర్చీలు మాత్రం తీసేశారుఈ ఘటనను రెడ్డిట్లో పోస్ట్ చేశారు. Reddit వినియోగదారు ఒక కుర్చీని దాని వెనుక భాగంలో అంటుకొని ఉన్న చిత్రాన్ని షేర్ చేసారు. దాని మీద ఉద్యోగులు కూర్చోవడానికి వీలు లేదు అని రాసి ఉండటం గమనార్హం.
అతను ఉత్పాదకతను పెంచడానికి ఉద్దేశించిన కారణంగా విరామ సమయంలో కూడా ఉద్యోగులు కూర్చోవడానికి వీలు లేకుండా చేశాడు.
"ఉద్యోగులు కూర్చోవడానికి ఇష్టపడనందున యజమాని త దుకాణంలో ఉన్న అన్ని కుర్చీలను తీసివేశాడు" అని క్యాప్షన్ జత చేయడం గమనార్హం
“కుర్చీలు లేవేంటి దుకాణంలో అని ఆశ్చర్యపోయాను. కస్టమర్ల కోసం ఎదురుగా ఉన్న కుర్చీలు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి, అయితే పని లేని సమయంలో, విరామ సమయంలో ఉద్యోగులు ఉపయోగించే అన్ని కుర్చీలు తీసివేశారు. స్టోర్ వెనుక భాగంలో ఇప్పటికీ ఒక కుర్చీ అందుబాటులో ఉంది, కానీ అది యజమాని కోసం కేటాయించినది’’ అని ఒకరు పేర్కొన్నారు.
"మొత్తం షిఫ్ట్ సమయంలో తమ సిబ్బంది నిలబడాలని ఆశించే యజమానులు ఖచ్చితంగా జీరో ఉద్యోగులకు అర్హులు" అని ఒక నెటిజన్ కామెంట్ చేయడం గమనార్హం.
