తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల కమిషన్ మంగళవారం నాడు విడుదల చేసింది.
న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల కమిషన్ మంగళవారం నాడు విడుదల చేసింది.
తెలంగాణలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ స్తానానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి ఎంపీ స్థానానికి ఈ ఏడాది ఏప్రిల్ 17న ఉప ఎన్నికలు జరగనున్నాయి.ఈ రెండు స్థానాలకు మార్చి 23వ తేదీన నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. అదే రోజు నుండి నామినేషన్ల స్వీకరించనున్నారు.
నామినేషన్ల దాఖలుకు మార్చి 30వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. నామినేషన్లను మార్చి 31 వ తేదీన స్కృూట్నీ చేస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 3 వ తేదీ చివరి తేదీ. ఏప్రిల్ 17వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు.
ఈ రెండు స్థానాల ఫలితాలను మే 2వ తేదీన నిర్వహించనున్నారు. నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య అనారోగ్యంతో మరణించడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది.ఏపీ రాష్ట్రంలోని తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ అనారోగ్యంతో మరణించాడు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది.
