హిందువులు తల్లిగా భావించే ఆవులను ఈద్ సందర్భంగా ముస్లింలు బలి ఇవ్వకూడదని ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు, ఎంపీ బద్రుద్దీన్ అజ్మల్ కోరారు. ఎవరి మానోభావాలనూ దెబ్బ తీయకూడదని కోరారు. 

అస్సాంలోని ముస్లిం సమాజం ఈద్ సందర్భంగా ఆవులకు ‘ఖుర్బానీ’ (బలి) ఇవ్వవద్దని ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (AIUDF) చీఫ్, లోక్ సభ ఎంపీ బద్రుద్దీన్ అజ్మల్ కోరారు. హిందువులు ఆవును తమ తల్లిగా భావిస్తుంటారని, కాబట్టి గోవధకు దూరంగా ఉండాలని ఆయ‌న త‌న క‌మ్యూనిటీ స‌భ్యుల‌ను కోరారు. 

presidential polls: నేడు జార్ఖండ్ కు వెళ్లనున్న రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌప‌ది ముర్ము

‘‘ భారతదేశం అనేక విభిన్న వర్గాలు, జాతులు, మతాలకు చెందిన వ్యక్తులకు నిలయం. ఆవును పవిత్ర చిహ్నంగా ఆరాధించే సనాతన విశ్వాసాన్ని మెజారిటీ భారతీయులు ఆచరిస్తున్నారు. హిందువులు ఆవును తల్లిగా భావిస్తారు. అందుకే ఈద్ సందర్భంగా ఆవులను చంపవద్దని ముస్లింలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ పద్ధతిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.’’ అని ఆయ‌న అన్నారు. ఇస్లాం ఏ జంతువును చంపాలని కోర‌ద‌ని చెప్పారు. అయినా మతపరమైన బాధ్యతను నెరవేర్చడానికి ఇతరుల మనోభావాలను దెబ్బతీయకుండా ఉండటానికి ఇతర జంతువులను ఉప‌యోగించుకోవాల‌ని ఆయ‌న ముస్లిం సమాజానికి విజ్ఞ‌ప్తి చేశారు. 

Scroll to load tweet…

రెండు సంవత్సరాల క్రితం కూడా ఈద్ రోజున ఆవులను బలి ఇవ్వవద్దని దారుల్ ఉలూమ్ దేవ్బంద్ కూడా విజ్ఞప్తి చేసినట్లు అజ్మల్ పేర్కొన్నారు. అస్సాంలోని జమియత్ ఉలేమా-ఎ-హింద్ కూడా ఈద్ రోజున ఆవులను వధించవద్దని ముస్లింలను కోరింది. కాగా ఏఐయూడీఎఫ్ చీఫ్ ప్రకటనపై విశ్వహిందూ పరిషత్ (VHP) నేత వినోద్ బన్సాల్ స్పందించారు. ఆవులను వధించడాన్ని శాశ్వతంగా నిలిపివేయాలని ముస్లిం నాయకులు మైనారిటీ కమ్యూనిటీకి విజ్ఞప్తి చేయాలని కోరారు. జిహాద్ పేరుతో అమాయకులను చంపే ప్రజలను ఏలాలని ఏఐయూడీఎఫ్ వంటి నాయకులను బన్సాల్ కోరారు.