మంత్రి కూతురిది కిడ్నాప్ కాదు.. ప్రేమవివాహం.. హై ప్రొఫైల్ కేసులో ట్విస్ట్...
ఓ మంత్రి తన కూతురు కిడ్నాప్ అయ్యిందంటూ ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఉరుకులు, పరుగులు పెట్టారు. తీరా చూస్తూ సదరు మంత్రి కూతురు వేరే రాష్ట్రంలోని పోలీసులకు తమ ప్రాణాలకు హాని ఉందంటూ ఫిర్యాదు చేసింది. తాను కిడ్నాప్ కాలేదని.. ప్రేమించిన వ్యక్తితో ఇష్టానుసారం వచ్చేశానని చెప్పుకొచ్చింది.
తమిళనాడు : ట్విస్టుల మీద ట్విస్టుల తర్వాత.. తమిళనాడు మంత్రి Shekhar Babu కుమార్తె డాక్టర్ జయకళ్యాణి love marriage చేసుకుంది. బెంగళూరులోని ఓ హిందూ ధార్మిక సంస్థలో సోమవారం సతీష్ ను ఆమె వివాహం చేసుకున్నట్లు సమాచారం. ఆరేళ్లుగా తాము ప్రేమించుకున్నామని, mariiageకి ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోవడంతో ఈ పని చేశామని Jayakalyani వివరణ ఇచ్చింది. అయితే తన తండ్రి నుంచి తమకు ప్రాణ హాని ఉందని ఈ కొత్త జంట.. బెంగళూరు సిటీ కమిషనర్ కమల పంత్ ను ఆశ్రయించారు. తమకు రక్షణ కల్పించారని కోరారు.
కిడ్నాప్ కేసు…
కూతురు కనిపించకుండా పోయేసరికి మంత్రి శేఖర్, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కూతురిని ఎవరో కిడ్నాప్ చేశారంటూ అందులో పేర్కొన్నాడు. దీంతో మంత్రి కూతురి కిడ్నాప్ మీడియాలో హెడ్లైన్స్ గా మారింది. ఇంకోపక్క పోలీసులు రాష్ట్రం మొత్తం జల్లెడ పట్టారు. ఈలోపు పక్క రాష్ట్రంలో పోలీసుల ముందు ప్రత్యక్షమై ట్విస్ట్ ఇచ్చింది జయకళ్యాణి.
బంధించారు… వేధించారు..
సతీష్ ఆ ఇంటి డ్రైవర్. పైగా దళితుడు. కొన్ని నెలల క్రితం కళ్యాణ్ ని పెళ్లి చేసుకుంటానని ఆమె తండ్రి మంత్రి శేఖర్ ను అడిగాడు.డ్రైవర్, పైగా కులాంతర వివాహం కావడంతో మంత్రి ఒప్పుకోలేదు. పైగా సతీష్ ను రెండు నెలల పాటు తమిళనాడు పోలీసుల సహాయంతో అక్రమంగా నిర్బంధించాడు కూడా ఇందుకు సంబంధించి గతంలో చేసిన ఓ వీడియో మీడియాలో వైరల్ అయింది. అయితే ఇప్పుడు తాము మేజర్లు అయినందున పెళ్లి చేసుకున్నామని తెలిపింది కళ్యాణి..
తమిళనాడులో అడుగుపెడితే చంపేస్తామని తమ తల్లిదండ్రులు బెదిరిస్తున్నారని, కాబట్టి తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నట్లు ఆమె మీడియా ముందు పోలీసులను వేడుకుంటుంది. తమిళనాడు హిందూ రెలిజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్ మినిస్టర్ అయిన శేఖర్ బాబు.. సీఎం స్టాలిన్ కు అత్యంత సన్నిహితుడు కూడా.